News June 25, 2024
నేడు టెట్ ఫలితాలు విడుదల

AP: టెట్ ఫలితాలను ఇవాళ అధికారులు విడుదల చేయనున్నారు. ఫలితాలతో పాటు తుది కీని కూడా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. కాగా ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 2.67 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 2.35 లక్షల మంది రాశారు. మార్చి 14నే ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. కానీ ఎన్నికల కోడ్ కారణంగా ఫలితాలు వెల్లడి కాలేదు.
Similar News
News April 10, 2026
ఈ నెలాఖరులోగా ఆస్తి పన్ను చెల్లిస్తే 5 శాతం రాయితీ

AP: మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో 2026-27 ఏడాదికి సంబంధించిన ఆస్తి పన్నుపై ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెలాఖరులోగా చెల్లిస్తే 5 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించింది. అలాగే 2025-26 వరకు ఉన్న ఆస్తి పన్ను బకాయిలపై 50 శాతం వడ్డీ మాఫీ సదుపాయాన్ని ఈ నెలాఖరు వరకు పొడిగించింది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
News April 10, 2026
రైతు భరోసా రెండో విడతపై అప్డేట్

TG: రైతు భరోసా రెండో విడత సాయాన్ని ఈ నెల 22లోపు అందించేందుకు ప్రభుత్వం నిధులు సిద్ధం చేస్తోంది. ఈ విడతలో 5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు నగదు జమ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే మూడో విడత సాయాన్ని ఈ నెలాఖరులోగా జమ చేయొచ్చని తెలుస్తోంది. కాగా గత నెల 23న తొలి విడత కింద ఒక ఎకరం భూమి వరకు రూ.6,000 చొప్పున సాయం అందించిన విషయం తెలిసిందే.
News April 10, 2026
మే 22/23న ‘స్వయంభు’ రిలీజ్?

భరత్ కృష్ణమాచారి డైరెక్షన్లో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘స్వయంభు’ సీజీ వర్క్స్ వేగంగా జరుగుతున్నట్లు సమాచారం. మే 15 నాటికి వాటిని పూర్తి చేసి 22 లేదా 23వ తేదీల్లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సంయుక్తా మేనన్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెలలోనే మూవీని రిలీజ్ చేయాల్సి ఉండగా గ్రాఫిక్స్ పనుల కారణంగా ఆలస్యమవుతోంది.


