News June 25, 2024

VZM: నేడు జిల్లాకు కొత్త కలెక్టర్

image

విజయనగరం జిల్లా కలెక్ట‌ర్‌గా నియమితులైన బీ.ఆర్.అంబేడ్కర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం జిల్లాకు చేరుకుంటారు. కలెక్టరే‌ట్‌లో మధ్యాహ్నం ప్రస్తుత కలెక్టర్ నాగ లక్ష్మి ఆయనకు బాధ్యతలు అప్పగించి రిలీవ్ అవుతారని తెలియజేశారు.

Similar News

News July 1, 2024

పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గోనున్న మంత్రి

image

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గోనున్నారు. సోమవారం ఉదయం 9 గంటలకు సాలూరు పట్టణంలోని 21వ వార్డులోని గొల్లవీధి సచివాలయం, 10:30కు కందులపథం, మధ్యాహ్నం 12 గంటలకు మక్కువ మండలం కవిరిపల్లి, 3 గంటలకు పాచిపెంట మండలం మంచాడవలస, సాయంత్రం 4:30కు మెంటాడ మండలం గుర్లతమ్మిరాజుపేట సచివాలయంలో హాజరుకానున్నారు.

News June 30, 2024

విజయనగరం: రబ్బర్ డ్యాం దిగువన వ్యక్తి మృతి

image

కొమరాడ మండలం జంఝావతి రబ్బర్ డ్యాం దిగువున స్నానానికి వెళ్లి వ్యక్తి మృతి చెందాడు. కొమరాడ ఎస్ఐ నీలకంఠం తెలిపిన వివరాల ప్రకారం.. బొండపల్లి మండలం గరుడబిల్లికి చెందిన కలియ దాసు(60) బూర్జి‌వలస స్టోన్ క్రషర్‌లో పని చేస్తున్నాడు. శనివారం సాయంత్రం పని ముగించుకుని స్నానానికి నదికి వెళ్ళిన దాసు మునిగి మృతి చెందాడు. మృతదేహాన్ని ఆదివారం గుర్తించి.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

News June 30, 2024

మంత్రి సంధ్యారాణికి ట్రైబల్ వెల్ఫేర్ టీచర్స్ వినతి 

image

గిరిజన ఆశ్రమ పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేయాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి ట్రైబల్ వెల్ఫేర్ టీచర్స్ ఆదివారం వినతి పత్రం అందజేశారు. జీవోనం-3 ప్రకారం స్పెషల్ డీఎస్సీ నిర్వహించాలని, గి.సం.శాఖకు మంజూరైన డీఈవో, డివైఈవో పోస్టులను భర్తీ చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 420 పండిట్ పోస్టులు అప్‌గ్రేడ్ జరిగేలా చూడాలని కోరారు. వారి వినతిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.