News June 25, 2024
27న జిల్లాకు కొత్త కలెక్టర్ తమీమ్ అన్సారియా
జిల్లాకు తాజాగా నియమితులైన కలెక్టర్ తమీమ్ అన్సారియా ఈనెల 27న రానున్నారు. ఆరోజు ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. కాగా ఇక్కడ కలెక్టర్గా పనిచేసి అల్లూరి సీతారామరాజు జిల్లాకు బదిలీ అయిన ఏఎస్ దినేష్ కుమార్ ఈనెల 26న రిలీవ్ కానున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయనకు జిల్లా అధికారులు వీడ్కోలు సభను ఏర్పాటు చేశారు.
Similar News
News July 1, 2024
ప్రకాశం: వెబ్సైట్లో టెన్త్ మార్కుల జాబితా
పదోతరగతి మార్కుల జాబితా www.bse.ap.gov.in వెబ్సైట్లో పొందుపరిచినట్లు డీఈవో సుభద్ర ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాలల యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులు పాఠశాల లాగిన్ ద్వారా విద్యార్థుల హాల్ టికెట్ ఉపయోగించి మార్కుల జాబితాను పొందవచ్చని పేర్కొన్నారు. మార్కుల జాబితాలో ఏదైనా తప్పులు ఉంటే విద్యార్థులు సరైన రికార్డులతో నేరుగా ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులకు తెలియజేయాలన్నారు.
News July 1, 2024
కురిచేడు: ఆలస్యంగా వెలుగులోకి మృతదేహం
కురిచేడు మండలంలోని దేకనకొండ గ్రామ పొలాల్లో ఓ వ్యక్తి మృతదేహం ఆదివారం లభ్యమైనట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. మృతుడు తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా గోపాలపేటకు చెందిన అయినవోని లక్ష్మయ్య (55)గా గుర్తించినట్లు ఎస్సై తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి దర్శికి బతుకుదెరువు కోసం అతను వచ్చినట్లు తెలిసింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
News July 1, 2024
ముండ్లమూరు: చేపలు పట్టేందుకు వెళ్లి..
బావిలో పడి వ్యక్తి మృతిచెందిన ఘటన ముండ్లమూరు మండలంలోని వేములలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వినుకొండ నాగరాజు (48) చెరువు వద్ద బావిలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఆసమయంలో ప్రమాదవశాత్తూ కాలు జారి బావిలో పడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న గ్రామస్థులు చెరువు వద్దకు వెళ్లి మృతదేహాన్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. నీరు పూర్తిగా బయటకు వెళ్తేనే మృతదేహం లభ్యమవుతుందని తెలిపారు.