News June 25, 2024

ప.గో జిల్లాకు ఎన్ని టీచర్ పోస్టులంటే..!

image

సీఎం చంద్రబాబు DSCపై తొలి సంతకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా 16,347 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి జులై1న షెడ్యూల్ విడుదల కానుంది. అయితే ప.గో జిల్లా వ్యాప్తంగా 1.067 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో DSC కోసం అభ్యర్థులు తీవ్ర స్థాయిలో ఆందోళన చేసిన విషయం తెలిసిందే..!

Similar News

News November 11, 2025

దొంగలను పట్టించిన పసుపు రంగు చెప్పులు

image

భీమవరం నుంచి హైదరాబాద్‌‌కు వెళ్లి చోరీలు చేస్తున్న నలుగురు దొంగలు పోలీసులకు పట్టుబడ్డారు. 2 రాష్ట్రాల్లో వీరిపై 12 కేసులు నమోదవ్వగా సౌత్ ఈస్ట్ జోన్, టాస్క్ ఫోర్స్ పోలీసులు అప్రమత్తమై చోరీ ప్రాంతాల్లోని సీసీ, ఫింగర్ ప్రింట్‌లను పరిశీలించగా..ఓ చోరుడి పసుపు రంగు చెప్పులు విభిన్నంగా కనిపించాయి. దీంతో నిఘా పెంచి నాదర్‌గుల్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నామని నిన్న మీడియాకు వెల్లడించారు.

News November 11, 2025

కాళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం సస్పెండ్

image

కాళ్ళ జడ్పీ హైస్కూల్ హెచ్ఎం‌ను సస్పెండ్ చేస్తూ డిఈఓ నారాయణ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రముఖ దినపత్రికల్లో ఇటీవల వచ్చిన ‘కుళ్లిన గుడ్లతో భోజనమా’ అనే వార్తపై వెంటనే విచారణ జరిగిందన్నారు. పాఠశాలలో 450 మంది విద్యార్థులకు 150 మంది మాత్రమే భోజనం చేస్తున్నారని నివేదికలో తేలింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన డీఈవో హెచ్ఎం ను సస్పెండ్ చేశారు.

News November 10, 2025

14, 15 తేదీల్లో రైతు సంఘం జిల్లా మహాసభలు

image

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ జిల్లా మహాసభలు ఈ నెల 14, 15 తేదీల్లో పశ్చిమగోదావరి జిల్లా, పాలకోడేరు మండలం మోగల్లు గ్రామంలో జరగనున్నాయి. ఈ మహాసభకు రైతు సంఘం జిల్లా క్యాడర్ అంతా పాల్గొని జయప్రదం చేయాలని నాయకులు ఆదివారం పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి. కృష్ణయ్య, కె. ప్రభాకర్ రెడ్డితో పాటు రాష్ట్ర ఆక్వా సంఘం నాయకులు బి. బలరాం తదితరులు పాల్గొంటారని వారు తెలిపారు.