News June 25, 2024

తూ.గో: కాలువల అభివృద్ధికి రూ.20.76 కోట్లు

image

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పంట కాలువలు, మురుగు కాలువలు, గుర్రపు డెక్క తొలగింపునకు ఆమోదం లభించిందని గోదావరి డెల్టా చీఫ్ ఇంజినీర్ సతీశ్ కుమార్ సోమవారం తెలిపారు. మొత్తం 306 పనులకు రూ.20.76 కోట్లు మంజూరు చేశారన్నారు. రూ. 31.50 కోట్లతో 430 పనులు చేసేందుకు ప్రతిపాదనలు పంపించగా.. తొలి ప్రాధాన్యతగా 306 పనులకు నిధులు కేటాయించారని తెలిపారు. మిగిలిన పనులకు త్వరలో నిధులు మంజూరు అవుతాయన్నారు.

Similar News

News September 18, 2025

మెగా డీఎస్సీ అభ్యర్థులకు నేడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ

image

మెగా డీఎస్సీ నియామక పత్రాలు జారీ ప్రక్రియ 19వ తేదీన అమరావతిలో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు డీఈవో వాసుదేవరావు బుధవారం తెలిపారు. టీచర్లుగా ఎంపికైన అభ్యర్థులందరూ 18వ తేదీన ఒక సహాయకునితో రాజమండ్రిలో కేటాయించిన పాఠశాలలకు రెండు పాస్ పోర్ట్ ఫోటోలు, ఆధార్ కాల్ లెటర్‌తో సాయంత్రం 4 గంటలకు హాజరు కావాలని సూచించారు. అభ్యర్థుల రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, బస్సుల్లో విజయవాడ పంపుతామన్నారు.

News September 18, 2025

పీహెచ్‌డీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం: వీసీ

image

యూజీసీ నెట్, జేఆర్‌ఎఫ్, సీఎస్‌ఐఆర్ నెట్ లలో అర్హత సాధించిన అభ్యర్థులకు పీహెచ్‌డీ ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ తెలిపారు. యూనివర్సిటీలో ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసినట్లు బుధవారం ఆమె వెల్లడించారు. ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో చూడవచ్చని సూచించారు.

News September 18, 2025

రాజమండ్రి అభివృద్దిపై మంత్రి నారాయణ సమీక్ష

image

రాజమండ్రిలో వివిధ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ఇంచార్జి కమిషనర్ కీర్తి చేకూరి, నగరపాలక సంస్థ అధికారులు హాజరయ్యారు. అభివృద్ధి పనులతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై ఆయన చర్చించారు.