News June 25, 2024
పోలవరం ప్రాజెక్ట్ పరిశీలనకు అంతర్జాతీయ నిపుణులు
పోలవరం సాగునీటి ప్రాజెక్టు పనులను త్వరలో అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలించనుంది. ఈ నెల 27న రాష్ట్రానికి కేంద్ర జలశక్తి శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ విజ్ఞప్తి మేరకు ఈ ప్రాజెక్టు పరిశీలనకు అమెరికా, కెనడా దేశాలకు చెందిన నలుగురు ఇంజినీరింగ్ నిపుణుల బృందం రానుంది. ప్రాజెక్టు వద్ద ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణానికి సవాలుగా ఉన్న డయాఫ్రంవాల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల సీపేజీ అంశాలను పరిశీలించనున్నారు.
Similar News
News July 1, 2024
కాళ్లు కడిగి పింఛన్ అందించిన మంత్రి నిమ్మల
ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాలకొల్లు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను సోమవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ క్రమంలో వృద్ధుల కాళ్లు కడిగి పింఛన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పంపిణీ చేశామని స్పష్టం చేశారు. ఇక ప్రతి నెల పెరిగిన పింఛన్ లబ్ధిదారుల ఇంటికి చేరుతుందన్నారు.
News July 1, 2024
వైసీపీ నిర్లక్ష్యం వల్లే పోలవరం ప్రాజెక్టుకు దెబ్బ: MP
వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే పోలవరం ప్రాజెక్టు దెబ్బతిందని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ ఆరోపించారు. 2014కు ముందు ప్రాజెక్టు పనులు కేవలం 5 శాతం మాత్రమే జరగ్గా.. 2014- 2019 మధ్య టీడీపీ హయాంలో 68 శాతం పనులు జరిగాయన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం కేవలం 3.8 శాతం పనులను మాత్రమే చేయగలిగిందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టును సందర్శించి.. పనులను గాడిలో పెడుతుందని చెప్పారు.
News July 1, 2024
ప.గో.: ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కాలేదని సూసైడ్
ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కాలేదని ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్న ఘటన ప.గో. జిల్లాలో జరిగింది. భీమవరం రూరల్ స్టేషన్ రైటర్ మహేశ్ తెలిపిన వివరాలు.. భీమవరం మండలం యమునేపల్లికి చెందిన బుంగా చందు(23) ఓ యువతిని ప్రేమించాడు. ఆమెకు ఇటీవల వేరే వ్యక్తితో పెళ్లి కుదరడంతో మనస్తాపంతో చందు శనివారం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పాతపాడు వద్ద ఉప్పుటేరులో ఆదివారం మృతదేహం లభ్యమైంది. సూసైడ్ చేసుకొని ఉంటాడని భావిస్తున్నారు.