News June 25, 2024
జగన్ది కిమ్ను తలదన్నే వ్యవహారశైలి: దేవినేని ఉమా

మాజీ సీఎం జగన్ది కిమ్ను తలదన్నే పెత్తందారీ వ్యవహార శైలి అని TDP సీనియర్ నేత దేవినేని ఉమా విమర్శించారు. ‘ఆయన ఇంట్లో ఉంటేనే 986 మందితో రక్షణ. బయటకొస్తే పరదాలతో పాటు 3 రెట్లు అదనం. కుటుంబం, రాజభవనాల రక్షణ కోసం ప్రత్యేక చట్టం. తాడేపల్లి ప్యాలెస్కు దగ్గర్లోని అరాచకాలు పట్టించుకోలేదు. ప్రజల భద్రత గాలికి వదిలేసి విలాసాలు అనుభవించే నువ్వు పెత్తందారివి కాక మరేంటి?’ అని జగన్ను ఆయన Xలో ప్రశ్నించారు.
Similar News
News December 29, 2025
మచిలీపట్నంలో నేడు మీకోసం కార్యక్రమం

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు కలెక్టర్ డి.కె. బాలాజీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని ఆయన సూచించారు.
News December 29, 2025
మచిలీపట్నంలో నేడు మీకోసం కార్యక్రమం

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు కలెక్టర్ డి.కె. బాలాజీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని ఆయన సూచించారు.
News December 28, 2025
కోడూరు పంట కాలువలో మృతదేహం కలకలం

కోడూరు-అవనిగడ్డ ప్రధాన పంట కాలువలో సుమారు 25 ఏళ్ల యువకుడి మృతదేహం లభ్యమైనట్లు ఎస్ఐ చాణిక్య తెలిపారు. ఆదివారం మాచవరం గ్రామం వద్ద కాలువలో కొట్టుకొచ్చిన ఈ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడు నలుపు రంగు టీ షర్ట్, నలుపు ప్యాంట్ ధరించి ఉన్నాడని వివరించారు. ఈ వ్యక్తికి సంబంధించిన వివరాలు తెలిసిన వారు వెంటనే కోడూరు లేదా అవనిగడ్డ పోలీస్ స్టేషన్లలో సమాచారం అందించాలని కోరారు.


