News June 25, 2024

మోదీ అహంకారం ప్రదర్శిస్తూనే ఉన్నారు: ఖర్గే

image

దేశంలోని సమస్యలపై స్పందించకుండా PM మోదీ అహంకారం చూపుతున్నారని INC చీఫ్ ఖర్గే అన్నారు. ‘మీరు 50ఏళ్ల నాటి ఎమర్జెన్సీని గుర్తు చేస్తున్నారు. కానీ గత 10ఏళ్లలో అప్రకటిత ఎమర్జెన్సీ గురించి మర్చిపోయారు’ అని అన్నారు. నైతికంగా ప్రజలు ఓడించినా మోదీకి అహంకారం తగ్గలేదని మండిపడ్డారు. NEET అవకతవకలు, ట్రైన్ యాక్సిడెంట్లు, మణిపుర్ అల్లర్లు, అస్సాం వరదలు, రూపాయి విలువ తగ్గడాన్ని PM పట్టించుకోరని విమర్శించారు.

Similar News

News January 1, 2026

ట్రైనీ కానిస్టేబుళ్లకు రూ.12వేలు.. ఉత్తర్వులు జారీ

image

AP: ట్రైనీ కానిస్టేబుళ్ల స్టైఫండ్‌ను రూ.4,500 నుంచి రూ.12వేలకు పెంచుతూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 16న మంగళగిరిలో జరిగిన నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం చంద్రబాబు స్టైఫండ్‌ను పెంచనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా కానిస్టేబుళ్ల శిక్షణ కార్యక్రమం రెండు దశల్లో 9 నెలలపాటు జరగనుంది.

News January 1, 2026

40’s తర్వాత నిద్ర తగ్గితే ఏం జరుగుతుందో తెలుసా?

image

40 ఏళ్ల తర్వాత శరీరానికి 7-9 గంటల నిద్ర అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. 7గంటల కంటే తక్కువ సమయం నిద్రపోతే టైప్-2 డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. మెదడు ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది. రోగనిరోధక శక్తి తగ్గుదలతోపాటు రోజువారీ కార్యకలాపాలకు బాడీ నెమ్మదిగా స్పందిస్తుంది. విటమిన్ డెఫిషియన్సీ, ప్రీ డయాబెటిస్, థైరాయిడ్, హార్మోన్ల అసమతుల్యత సమస్యలు వచ్చే ప్రమాదముంది.

News January 1, 2026

IASలతో CM రేవంత్ సెలబ్రేషన్స్

image

TG: బేగంపేటలోని IAS ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్‌లో నిర్వహించిన న్యూఇయర్ వేడుకల్లో CM రేవంత్ పాల్గొన్నారు. IASలు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రజలకు CM రేవంత్ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ రైజింగ్ విజన్​ 2047 లక్ష్య సాధన దిశగా ఈ ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం మరింత ముందుకు సాగుతుంది. అందరి ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రాధాన్యమిస్తాం’ అని తెలిపారు.