News June 25, 2024
శ్రీకాకుళం: అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719305519391-normal-WIFI.webp)
వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ అధికారులతో టెక్కలి ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మంగళవారం విజయవాడ వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ సీజన్కు సంబంధించిన ఎరువులను సిద్ధం చేయాలని ఆదేశించారు. అన్ని జిల్లాల్లో భూసార పరీక్షలు జరపాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల నమూనాలు సేకరించి ఫలితాలు విడుదల చేయాలని ఆదేశించారు.
Similar News
News July 1, 2024
శ్రీకాకుళం: దోమల నివారణను అజెండాగా స్వీకరిద్దాం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719810837143-normal-WIFI.webp)
దోమల నివారణను ఎజెండాగా స్వీకరించి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని పిలుపునిచ్చారు. నగరంలోని డీఎంహెచ్ ఓ కార్యాలయం వద్ద డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. వర్షాకాలం ప్రారంభం కావడంతో ఇంటి పరిసరాల్లో నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. దోమలు ప్రబలకుండా కాలువల్లో స్ప్రేయింగ్ చేయాలన్నారు.
News July 1, 2024
శ్రీకాకుళం వ్యాప్తంగా 1,43,008 మందికి పెన్షన్లు అందజేత
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719806493785-normal-WIFI.webp)
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉదయం 8.40 గంటలకు 1,43,008 మందికి పెన్షన్లు అధికారులు అందజేశారు. జిల్లా మొత్తం 3,19,702 పెన్షన్లు కాగా ఇప్పటికే జిల్లా అధికారులు సచివాలయ సిబ్బందితో నేరుగా పెన్షన్ల అందజేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో శతశాతం పెన్షన్లు పంపిణీ పనిలో ఉద్యోగులు ఉన్నారు. ఇప్పటికే పెన్షన్లు అందుకున్న వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
News July 1, 2024
శ్రీకాకుళం: పింఛన్ల పంపిణీ పై ఆరా తీసిన జిల్లా కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719798834124-normal-WIFI.webp)
ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్ ఆన్లైన్లో పరిశీలించారు. సోమవారం ఉదయం స్థానిక డీఆర్డీఏ కార్యాలయంలో పింఛన్లు ఏ విధంగా పంపిణీ చేస్తున్నారో పరిశీలించారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి పింఛను అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మొదటి రోజే శత శాతం పూర్తి కావాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు.