News June 25, 2024

బుల్ జోరు.. ఆల్ టైమ్ రికార్డులతో మార్కెట్లు క్లోజ్

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ట్రేడింగ్‌ను లాభాలతో ముగించాయి. తొలిసారిగా సెన్సెక్స్ 78వేల మార్క్, నిఫ్టీ 23,700 దాటి జీవిత కాల గరిష్ఠాన్ని నమోదు చేశాయి. 712 పాయింట్ల లాభంతో 78,053 వద్ద సెన్సెక్స్, 183 పాయింట్ల లాభంతో 23,721 వద్ద నిఫ్టీ ట్రేడింగ్ ముగించాయి. రియల్టీ షేర్లు నష్టాలను నమోదు చేసినా బ్యాంకింగ్ రంగం దూసుకెళ్లడంతో ఆ ప్రభావం మార్కెట్‌పై పెద్దగా కనిపించలేదు.

Similar News

News December 29, 2025

నటి మాధవీలతపై కేసు నమోదు

image

నటి మాధవీలతపై HYDలోని సరూర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. SMలో సాయిబాబాపై అభ్యంతరకరంగా పోస్టులు పెట్టారని మాధవీలతతో పాటు పలువురు యూట్యూబర్లపైనా కేసు పెట్టారు. వీరి పోస్టులు ప్రజల భావోద్వేగాలను దెబ్బతీశాయని ఫిర్యాదు అందినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 10 గంటలకు పోలీస్ స్టేషన్‌కు హాజరు కావాలని ఆదేశించారు. అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

News December 29, 2025

రాయచోటి ప్రజలకు క్షమాపణలు: మంత్రి రాంప్రసాద్

image

AP: రాయచోటిని జిల్లా కేంద్రంగా తొలగించడంతో <<18702293>>కన్నీళ్లు<<>> పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈ అంశంపై తొలిసారి స్పందించారు. స్థానిక ప్రజలకు క్షమాపణ చెప్పారు. రాయచోటి ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టబోనని స్పష్టం చేశారు. ప్రజలు ఏడాదిలో ఈ బాధ నుంచి బయటపడేలా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. ఎవరి బెదిరింపులకు భయపడనని, విమర్శలకు సరైన రీతిలో సమాధానం ఇస్తానన్నారు.

News December 29, 2025

డాక్యుమెంట్, ట్రైన్ చేసిన దండకారణ్య డాక్టర్

image

లొంగిపోయిన మావోయిస్టు చందు దండకారణ్య మిస్టరీ డాక్టర్ రఫీఖ్/మణిదీప్ గురించి అనేక విషయాలు వెల్లడించారు. పంజాబ్‌కు చెందిన ఈ డాక్టర్ కనీస సౌకర్యాలతోనే అడవిలో సర్జరీలూ చేశారు. మావోలు, ఆదివాసీలకు చేసే ప్రతి ట్రీట్మెంట్ డాక్యుమెంట్ చేసి దళానికి కాపీ ఇచ్చి, ప్రతి టీంలో అల్లోపతి, ఆయుర్వేదంలో రెగ్యులర్ ట్రీట్మెంట్ నేర్పారు. 2016లో దండకారణ్యం నుంచి ఝార్ఖండ్‌కు వెళ్లిన అతడి ఆచూకీ ఇంకా బయటకు తెలియదు.