News June 25, 2024

NLR: క్వార్ట్జ్ అక్రమాలపై సీఐడీకి ఫిర్యాదు

image

నెల్లూరు జిల్లాలో జరిగిన క్వార్ట్జ్ అక్రమాల్లో సజ్జల రామకృష్ణ, ఆయన అనుచరుల పాత్ర తేల్చాలని సైదాపురం గనుల యజమాని బద్రీనాథ్ సీఐడీ DSPకి ఫిర్యాదు చేశారు. ‘సజ్జల కనుసన్నల్లోనే గనుల దోపిడీ జరిగింది. జోగుపల్లిలోని 240 ఎకరాల్లో మాకు 8గనులు ఉన్నాయి. రెండేళ్లుగా అక్రమంగా గనులు తవ్వి రూ.వేల కోట్ల విలువైన క్వార్ట్జ్ దోచేశారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడ్డారు’ అని ఆయన ఆరోపించారు.

Similar News

News July 1, 2024

NLR: నేటి నుంచి బాదుడే బాదుడు

image

దేశ వ్యాప్తంగా జాతీయ రహదారిపై టోల్ ప్లాజాల వద్ద సోమవారం నుంచి పెంచిన రుసుము వసూళ్లు చేస్తారు. నెల్లూరు జిల్లా పరిధిలో వెంకటాచలం, కావలి, బూదనం టోల్ గేట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో వాహనాల నుంచి అదనంగా రూ.15 వరకు వసూళ్లు చేస్తారు. ఈ మేరకు వాహనదారులు తమ ఫాస్టాగ్‌లో నగదు నిల్వలు సరిచూసుకోవాలని టోల్ గేట్ల నిర్వాహకులు చూస్తున్నారు.

News June 30, 2024

రేపటి నుంచి నూతన నేర చట్టాలు అమలు: నెల్లూరు ఎస్పీ

image

జూలై ఒకటో తేదీ నుంచి దేశంలో నూతన నేర చట్టాలు అమలులోకి వస్తున్నాయని జిల్లా ఎస్పీ కే.ఆరీఫ్ హఫీజ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష అధినియమ్ చట్టాలుగా మారయన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా చట్టాలపై అవగాహన ఉండాలన్నారు.

News June 30, 2024

సబ్ స్టేషన్లలో అందుబాటులో ఉండాలి: SE

image

నెల్లూరు సర్కిల్ పరిధిలో వినియోగదారులకు మరింత మెరుగ్గా కరెంట్ సరఫరా అందించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని APSPDCL ఎస్ఈ విజయన్ వెల్లడించారు. ఇందులో భాగంగానే ‘పీక్ హవర్స్‌లో సబ్ స్టేషన్ల తనిఖీ’ అనే బృహత్తర కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని ఆయా సబ్ స్టేషన్లలో అధికారులు అందుబాటులో ఉండి కరెంట్ సరఫరాల్లో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు.