News June 25, 2024
టాలీవుడ్ స్టోరీస్ C/O ఉత్తరాంధ్ర
ఉత్తరాంధ్రలో జరిగిన యధార్థ సంఘటనలే కథలుగా వెండితెరపై అలరిస్తున్నాయి. ఇటీవల పలాస, జయమ్మ పంచాయతీ, కోటబొమ్మాళి లాంటి సినిమాలు ప్రేక్షకుల మన్ననలు పొందాయి. తాజాగా..పాకిస్థాన్ జైలులో చిక్కుకున్న సిక్కోలు మత్స్యకారుడి స్టోరీలో నాగచైతన్య-సాయి పల్లవి నటిస్తున్నారు. రామ్చరణ్-బుచ్చిబాబు సినిమాకు కోడి రామ్మూర్తి జీవిత చరిత్రే ఆధారమని టాక్. అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్ ఒక మూవీ డైరెక్ట్ చేస్తున్నట్లు సమాచారం.
Similar News
News July 1, 2024
విశాఖ సీపీగా బాధ్యతలు స్వీకరించిన శంకబ్రత బాగ్చీ
విశాఖ సీపీగా శంకబ్రత బాగ్చీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. వైజాగ్లో పని చెయ్యడం తనకు చాలా గర్వంగా ఉందన్నారు. తనకు ఇక్కడ పని చెయ్యడానికి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తనకు పెళ్లి అయ్యాక హనీమూన్ ఎక్కడకి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నప్పుడు అందరూ స్విట్జర్లాండ్ వెళ్లాలన్నారు కానీ.. అప్పుడు డబ్బులు లేకపోవడంతో విశాఖనే ఎంచుకున్నాని తెలిపారు.
News July 1, 2024
విశాఖ నగరానికి తలమానికంగా క్లాక్ టవర్
విశాఖ మహా నగరానికి జగదాంబ జంక్షన్లో ఏర్పాటు చేసిన క్లాక్ టవర్ తలమానికంగా నిలిచింది. నగరాభివృద్ధిలో భాగంగా అధికారులు సుందరీకరణ పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో నగరంలోని అతి ముఖ్యమైన జగదాంబ సెంటర్లో క్లాక్ టవర్ను నూతనంగా నిర్మించారు. ఈ టవర్ చుట్టూ విద్యుత్ దీపాలను అందంగా అలంకరించారు. ఈ క్లాక్ టవర్ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది.
News July 1, 2024
తగ్గుముఖం పట్టిన పర్యాటకుల తాకిడి
ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహలకు పర్యాటకుల తాకిడి తగ్గింది. గతవారం రోజులుగా బొర్రాను సందర్శించేవారి సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఈ ఆదివారం 1,700 మంది సందర్శించగా రూ.1.57 లక్షల ఆదాయం వచ్చిందని మేనేజర్ గౌరీ శంకర్ తెలిపారు. తాటిగూడ, కటికి, డముకు వ్యూపాయింట్ తదితర సందర్శిత ప్రాంతాలన్నీ ఈవారం వెలవెలబోయాయి. వేసవిసెలవులు ముగియడంతో పాఠశాలలు, కళాశాలలు తెరుచుకున్నాయి. దీంతో పర్యాటకుల సంఖ్య తగ్గుతుంది.