News June 25, 2024

అభ్యర్థులు లెక్కలు చెప్పండి: డీఆర్ఏ

image

ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు వారి తుది ఎన్నికల లెక్కల వివరాలను ఎన్నికల వ్యయ పరిశీలకులకు సమర్పించాలని తిరుపతి డీఆర్ఏ పెంచల కిషోర్ ఆదేశించారు. తిరుపతి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వివిధ పార్టీల ప్రతినిధులు, వ్యయ పరిశీలకులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా ఎన్నికల వ్యయ నోడల్ అధికారి చరణ్ రుద్రరాజు తదితరులకు డీఆర్ఏ పలు సూచనలు చేశారు.

Similar News

News July 1, 2024

తిరుపతి: 4 నుంచి ఈఏపీ సెట్ కౌన్సెలింగ్

image

తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈఏపీ సెట్-2024 (ఎంపీసీ స్ట్రీమ్) కౌన్సెలింగ్ జులై 4 నుంచి ఆన్‌లైన్ ద్వారా నిర్వహించనున్నారు. అభ్యర్థులు 1వ తేదీ నుంచి 7 తేదీ లోపు ఆన్‌లైన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోఆర్డినేట్ ద్వారకానాథ్ రెడ్డి సూచించారు. 8 నుంచి 12వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల నమోదు ఉంటుంది. 13న మార్పులు చేర్పులు, 16న సీట్ అలాట్‌మెంట్ జరుగుతుంది.

News July 1, 2024

అక్రమాల్లో జగన్ తర్వాత పెద్దిరెడ్డే: మంత్రి

image

వైసీపీ పాలనలో జగన్ తర్వాత ఎక్కువగా అక్రమాలకు పాల్పడి దోచుకుంది మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డేనని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ‘రాయలసీమ జిల్లాల్లో పెద్దిరెడ్డి ఫ్యామిలీదే పెద్ద మాఫియా. ల్యాండ్, వైన్, మైన్ అన్ని కుంభకోణాలు చేశారు. వాటిని ఆధారాలతో సహా త్వరలో బయటపెడతా. శాంతిభద్రతల సమస్య నేపథ్యంలోనే పుంగనూరుకు వెళ్లడానికి మిథున్ రెడ్డికి పర్మిషన్ ఇవ్వలేదు’ అని మంత్రి చెప్పారు.

News July 1, 2024

CTR: నేడు 5.4 లక్షల మందికి పింఛన్ల పంపిణీ

image

చిత్తూరు జిల్లాలో 2.71 లక్షల మందికి సోమవారం నుంచి పింఛన్లను పంపిణీ చేయనున్నట్టు కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ 181.02 కోట్లను విడుదల చేసిందని వెల్లడించారు. పూతలపట్టు మండలంలో జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొంటారు. మరోవైపు తిరుపతి జిల్లాలో 2.69 లక్షల మందికి రూ.182.33 కోట్లను అందజేయనున్నారు. మొత్తంగా 5.4 లక్షల మందికి రూ.363.05 కోట్లు పంపిణీ చేస్తారు.