News June 26, 2024
నేడు తాడిపత్రి మున్సిపల్ అత్యవసర సమావేశం
తాడిపత్రి పురపాలక అత్యవసర సమావేశం నేడు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రామ్ మోహన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో సమావేశం ఉంటుందని పట్టణంలోని అన్ని వార్డు కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది హాజరుకావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News July 1, 2024
కదిరిలో మహిళపై అత్యాచారయత్నం
కదిరి మండలంలోని ఓ గ్రామంలో మహిళపై అత్యాచారయత్నం జరిగిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన భాను ప్రతాప్ రెడ్డి అదే గ్రామంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై శనివారం రాత్రి అత్యాచారయత్నం చేశాడు. ఆమె కేకలు వేయడంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు. ఈ మేరకు బాధితురాలు భర్తతో కలిసి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు సీఐ మోహన్ తెలిపారు.
News July 1, 2024
అనంత: మేనమామ భార్యతో బాలుడి సంబంధం..హత్య
కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో వ్యక్తి హత్యకు గురైంది తెలిసిందే. సీఐ హరినాథ్ కథనం..వన్నూరుస్వామి అక్క కొడుకైన 17ఏళ్ల బాలుడు చిన్నప్పటి నుంచి కురాకులతోటలోని మామ ఇంట్లో ఉండేవాడు. మృతుడి భార్యతో సన్నిహితంగా ఉండేవాడు. మామను అడ్డు తొలగించుకోవాలనకున్నాడు. ప్లాన్ ప్రకారం ఈనెల 28న ఇద్దరూ మద్యం తాగుతున్న సమయంలో కత్తితో గొంతు కోసి పరారయ్యాడు.బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు.
News July 1, 2024
గుమ్మఘట్ట: బీటీ ప్రాజెక్టులో చేపల వేట నిషేధం
గుమ్మఘట్ట మండలంలోని భైరవాని తిప్ప ప్రాజెక్టులో జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు చేపల వేటను నిషేధిస్తున్నట్లు గుమ్మఘట్ట ఎఫ్ డీ ఓ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సమయంలో చేపలు తమ సంతానోత్పత్తి ప్రక్రియ కొనసాగిస్తాయని పేర్కొన్నారు. మత్స్యకారులు ఈ విషయాన్ని గమనించి వేటకు దూరంగా ఉండాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వేట సాగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.