News June 26, 2024
అన్నవరం సత్యదేవుని దర్శన విధానంలో మార్పులు
అన్నవరం సత్యదేవుని దర్శన విధానంలో మార్పులు చేపట్టారు. దశమి, ఏకాదశి, పౌర్ణమి తదితర పర్వదినాలు, రద్దీ రోజుల్లో శీఘ్ర దర్శనం రూ.200, ప్రదక్షిణ దర్శనం రూ.300 టికెట్లు మధ్యాహ్నం వరకు నిలిపివేయాలని ఈవో ఆదేశించారు. మధ్యాహ్నం మూడు తరువాతే రూ.300 ప్రదక్షిణ దర్శనానికి అనుమతిస్తారు. భక్తులు ఎక్కువ సమయం నిరీక్షించడం, సాధారణ దర్శనానికి వచ్చే వారికి ఇబ్బందులు ఏర్పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Similar News
News July 1, 2024
క్యాంపు కార్యాలయానికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్
కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం, చేబ్రోలు హైవే పక్కన ఉన్న ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఈ మేరకు ఆయనకు కలెక్టర్ శన్మోహన్, ఎస్పీ సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి భరణి, ఇతర అధికారులు స్వాగతం పలికారు.
News July 1, 2024
తూ.గో.: పవన్ కళ్యాణ్ ENTRY
డిప్యూటీ సీఎం, పిఠాపురం MLA పవన్ కళ్యాణ్ కాసేపటి క్రితమే రాజమండ్రి విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా పిఠాపురం నియోజకవర్గానికి బయలుదేరారు. గొల్లప్రోలు మండలంలో ఈ రోజు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న విషయం తెలిసిందే.
News July 1, 2024
తూ.గో.: పిల్లలు పుట్టడం లేదని సూసైడ్
తూ.గో. జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామానికి చెందిన ఓ వివాహిత సూసైడ్ చేసుకుంది. ఎస్సై అప్పలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తోట రాశి (24) నాలుగేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన దుర్గారావును ప్రేమవివాహం చేసుకుంది. కాగా పిల్లలు పుట్టకపోవడంతో మనస్తాపంతో ఆదివారం కాలువలో దూకి సూసైడ్ చేసుకుంది. మృతురాలి తల్లి మంగ ఫిర్యాదుతో కేసు నమోదుచేసినట్లు ఎస్సై తెలిపారు.