News June 26, 2024
నేడు తెలంగాణలో స్కూళ్ల బంద్
తెలంగాణలో నేడు స్కూళ్లు మూతబడనున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకురావాలనే డిమాండ్తో ABVP రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్ల బంద్కు పిలుపునిచ్చింది. పాఠశాలల యాజమాన్యాలు సహకరించాలని కోరింది. ఇప్పటికే పలు స్కూళ్ల యాజమాన్యాలు సెలవు ఉంటుందని తల్లిదండ్రులకు మెసేజులు పంపాయి. కొన్ని ప్రాంతాల్లో పాఠశాలల మూసివేతపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
Similar News
News October 10, 2024
TEAM INDIA: మనల్ని ఎవడ్రా ఆపేది!
ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలోనూ టీమ్ ఇండియాకు ఎదురే లేకుండా పోయింది. అటు టెస్టుల్లో, ఇటు టీ20ల్లో వరుస విజయాలు సాధిస్తోంది. ఈ ఏడాది 8 టెస్టులు ఆడగా ఒక్క మ్యాచ్లోనే ఓడి ఏడింట్లో జయకేతనం ఎగరేసింది. మరోవైపు 21 టీ20లు ఆడి ఒకే ఒక్క మ్యాచ్లో ఓటమి పాలైంది. కాగా ఈ ఏడాది భారత్ 3 వన్డేలే ఆడినా రెండిట్లో ఓడి ఒకటి టై చేసుకుంది. అటు టెస్టుల్లో రోహిత్ శర్మ, ఇటు టీ20ల్లో సూర్యకుమార్ సారథ్యంలో భారత్ దూసుకుపోతోంది.
News October 10, 2024
మోపిదేవి పార్టీ మారడం బాధాకరం: జగన్
AP: రేపల్లె నియోజకవర్గ నేత మోపిదేవి వెంకట రమణ పార్టీ వీడటంపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ఆయన విషయంలో ఏనాడు తప్పు చేయలేదని, మోపిదేవి పార్టీ మారడం బాధాకరమని అన్నారు. మండలి రద్దు చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు మోపిదేవిని రాజ్యసభకు పంపామని గుర్తు చేశారు. రాజకీయాల్లో కష్టాలు శాశ్వతం కాదని అన్నారు. తనను జైల్లో పెట్టినా ప్రజల ఆశీర్వాదంతో సీఎం అయ్యానని వ్యాఖ్యానించారు. దేవుడు మంచివైపు ఉంటాడని చెప్పారు.
News October 10, 2024
సైలెంట్గా ఉన్నందుకు క్షమించండి: షకీబ్
బంగ్లా మాజీ PM హసీనాకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు తాను మద్దతుగా నిలవనందుకు క్షమించాలని ఆ దేశ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ ఫ్యాన్స్ను కోరారు. ఈ నెల 21న ఢాకాలో సౌతాఫ్రికాతో జరిగే తన ఆఖరి టెస్టుకు పెద్ద ఎత్తున రావాలని విజ్ఞప్తి చేశారు. ‘నియంతృత్వ వ్యతిరేక నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు, క్షతగాత్రులకు నా ప్రగాఢ సంతాపం’ అని పేర్కొన్నారు. హసీనా పార్టీ తరఫునే ఆయన ఎంపీ కావడం గమనార్హం.