News June 26, 2024

తిరుపతి: కాకినాడ, విశాఖ రైళ్ల రద్దు

image

విజయవాడ డివిజన్ లోని నిడదవోలు-కడియం సెక్షన్లో నిర్వహణ పనుల కారణంగా తిరుపతి నుంచి రాకపోకలు సాగించే రెండు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ద.మ.రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. తిరుపతి-కాకినాడ టౌన్ (17249) రైలును ఆగస్టు 10,కాకినాడ టౌన్-తిరుపతి (17250) రైలును ఆగస్టు 11,తిరుపతి-విశాఖపట్నం డబుల్ డెక్కర్ (22708) ను ఆగస్టు 9వరకు, విశాఖపట్నం-తిరుపతి డబుల్ డెక్కర్ (22707) రైలును 10వ తేదీ వరకు రద్దు చేశారు.

Similar News

News July 1, 2024

పెద్దిరెడ్డి అరాచకాలపై క్యాసెట్ పంపిస్తా: బాబు

image

పుంగనూరులో అధికార పార్టీ దాడులు ఎక్కువైనట్లు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేసిన ఆరోపణలపై TDP ఇన్‌ఛార్జ్ చల్లా బాబు స్పందించారు. ‘గత రెండేళ్లలో పుంగనూరులో ప్రతిపక్షాలపై మీ నాన్న పెద్దిరెడ్డి చేసిన దాడులు ఏంటో తెలుసుకోవాలి. మా కార్యకర్తలపై 307 కేసులు పెట్టారు. పుంగనూరులో మీ అరాచకాలను క్యాసెట్ రూపంలో పంపమంటే పంపిస్తా. మీ దాడులకు టీడీపీ నేతలు ఇళ్లు వదిలి వెళ్లిపోయారు’ అని బాబు అన్నారు.

News July 1, 2024

చిత్తూరు: 3 నుంచి వినతుల స్వీకరణ

image

విద్యుత్తు వినియోగదారుల సమస్యలు సత్వర పరిష్కారమే లక్ష్యంగా ప్రతి బుధవారం డివిజన్ కార్యాలయాల్లో వినతుల స్వీకరణకు శ్రీకారం చుట్టినట్టు చిత్తూరు ఎస్ఈ సురేంద్ర నాయుడు తెలిపారు. సర్కిల్ పరిధిలోని ఎనిమిది డివిజన్ కార్యాలయాల్లో వినతుల స్వీకరణ ఈనెల 3 నుంచి ప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రతి బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వినియోగదారుల నుంచి వినతులు స్వీకరిస్తామన్నారు.

News July 1, 2024

తిరుపతి: 4 నుంచి ఈఏపీ సెట్ కౌన్సెలింగ్

image

తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈఏపీ సెట్-2024 (ఎంపీసీ స్ట్రీమ్) కౌన్సెలింగ్ జులై 4 నుంచి ఆన్‌లైన్ ద్వారా నిర్వహించనున్నారు. అభ్యర్థులు 1వ తేదీ నుంచి 7 తేదీ లోపు ఆన్‌లైన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోఆర్డినేట్ ద్వారకానాథ్ రెడ్డి సూచించారు. 8 నుంచి 12వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల నమోదు ఉంటుంది. 13న మార్పులు చేర్పులు, 16న సీట్ అలాట్‌మెంట్ జరుగుతుంది.