News June 26, 2024
తూ.గో: తల్లి మరణించిన కాసేపటికే కొడుకు కన్నుమూత

తల్లి మరణించిన కాసేపటికి కొడుకు కన్నుమూసిన విషాద ఘటన తాళ్లరేవులో జరిగింది. మృతుడి భార్య 8ఏళ్ల క్రితం పుట్టింటికి వెళ్లింది. నూకరాజుకు పక్షవాతం ఉండడంతో తల్లి కామేశ్వరి చేపల వ్యాపారం చేసి చూసుకొనేది. మంగళవారం రక్తపోటు రాగా ఆమెను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది. నూకరాజుకు తల్లిని చూపించి దహనసంస్కారాలకు తీసుకెళ్లారు. దీంతో కాసేపటికే కొడుకు కన్నుమూశారు.
Similar News
News November 11, 2025
తూ.గో: హోం స్టే పెడితే రూ.5లక్షలు

తూ.గో జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో కనీసం ఓ గది నుంచి గరిష్ఠంగా 6గదులతో హోం స్టే ఏర్పాటు చేసుకోవచ్చని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ‘కొత్తగా పెట్టేవారికి స్వదేశ దర్శన్ పథకం కింద రూ.5 లక్షల ప్రోత్సాహకం ఇస్తాం. పాత హోమ్ స్టే పునరుద్ధరణకు రూ.3లక్షల వరకు సాయం చేస్తాం. 7ఏళ్లు 100 శాతం SGST తిరిగి చెల్లిస్తాం. మొదటి మూడేళ్లు రిజిస్ట్రేషన్ ఉచితం. యజమాని అదే ఏరియాలో ఉండాలి’ అని కలెక్టర్ చెప్పారు.
News November 11, 2025
రన్నర్గా తూ.గో జిల్లా అధికారులు

అనంతపురంలో ఈనెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు 7వ రాష్ట్రస్థాయి రెవెన్యూ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్-2025 జరిగింది. ఇందులో తూ.గో జిల్లా రెవెన్యూ అధికారులు, సిబ్బంది ప్రతిభ చూపారు. బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో కడియం తహసీల్దార్ ఎం.సునీల్ కుమార్, రాజానగరం సీఎస్ డీటీ జి.బాపిరాజు జట్టు రన్నర్గా నిలిచారు. వాలీబాల్ విభాగంలో తూ.గో జట్టు రన్నర్గా నిలిచింది.
News November 11, 2025
తూ.గో జిల్లాలో 8,773 ఇళ్ల నిర్మాణం పూర్తి

తూ.గో జిల్లాలో 8,773 మంది లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నారని హౌసింగ్ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్(PD) నాతి బుజ్జి వెల్లడించారు. ఈ మేరకు బుధవారం గృహప్రవేశాలు చేస్తారని చెప్పారు. అన్ని నియోజక వర్గాల పరిధిలో స్థానిక ప్రజాప్రతినిధులు సమక్షంలో గృహప్రవేశాలు వేడుకగా నిర్వహిస్తామన్నారు. గోకవరం మండలం కామరాజుపేటలో జరిగే కార్యక్రమానికి కలెక్టర్ హాజరవుతారన్నారు.


