News June 26, 2024

ఒంగోలు: అంబులెన్స్ వాహనాల్లో ఉద్యోగ అవకాశాలు

image

జిల్లాలో 1962 పశు సంచార అంబులెన్స్ వాహనాలకు సంబంధించి ఖాళీగా ఉన్న పైలట్ పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మేనేజర్ నెమలి శివశంకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగాల భర్తీలో భాగంగా పైలట్ పోస్టుకి పదో తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండి హెవీ లైసెన్స్ లేదా బ్యాడ్జి లైసెన్స్ కలిగి ఉండాలన్నారు . ఈ నెల 28వ తేదీ ఒంగోలు బస్టాండ్ సమీపంలో ఉన్న కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.

Similar News

News July 1, 2024

కురిచేడు: ఆలస్యంగా వెలుగులోకి మృతదేహం

image

కురిచేడు మండలంలోని దేకనకొండ గ్రామ పొలాల్లో ఓ వ్యక్తి మృతదేహం ఆదివారం లభ్యమైనట్లు ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు. మృతుడు తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా గోపాలపేటకు చెందిన అయినవోని లక్ష్మయ్య (55)గా గుర్తించినట్లు ఎస్సై తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి దర్శికి బతుకుదెరువు కోసం అతను వచ్చినట్లు తెలిసింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

News July 1, 2024

ముండ్లమూరు: చేపలు పట్టేందుకు వెళ్లి.. 

image

బావిలో పడి వ్యక్తి మృతిచెందిన ఘటన ముండ్లమూరు మండలంలోని వేములలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వినుకొండ నాగరాజు (48) చెరువు వద్ద బావిలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఆసమయంలో ప్రమాదవశాత్తూ కాలు జారి బావిలో పడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న గ్రామస్థులు చెరువు వద్దకు వెళ్లి మృతదేహాన్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. నీరు పూర్తిగా బయటకు వెళ్తేనే మృతదేహం లభ్యమవుతుందని తెలిపారు.

News July 1, 2024

గిద్దలూరు మీదుగా వెళ్లే ఎక్స్ ప్రెస్ రైలు పొడిగింపు

image

గుంటూరు – సికింద్రాబాద్ ట్రైన్ నంబర్ 17253 రైలు జులై 1 నుంచి ఔరంగాబాద్ వరకు పొడిగించి ఔరంగాబాద్ ఎక్స్ ప్రెస్ రైలుగా నడుపుతున్నట్లు గిద్దలూరు కమర్షియల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు. గుంటూరులో ఉదయం 7.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.50 గంటలకు ఔరంగాబాద్ చేరుకుంటుందన్నారు. ఇదే రైలు ఔరంగాబాద్‌లో సాయంత్రం 4.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9.30 గంటలకు గుంటూరు చేరుతుందన్నారు.