News June 26, 2024
నిజామాబాద్లో దారుణ హత్య.. వివరాలు ఇవే!

నిజామాబాద్లో వ్యక్తి <<13508067>>దారుణ హత్య<<>>కు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన మంగళవారం వెలుగుచూసింది. ధర్మపురి హిల్స్ ప్రాంతంలోని రంజానీ బాబా దర్గా ప్రాంతంలో హాసన్(50)ను గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి, గొంతు కోసి దారుణంగా హత్యచేసినట్లు స్థానికులు తెలిపారు. సోమవారం రాత్రి హత్య జరిగిందని, దర్గా నిర్వహణలో వచ్చే డబ్బుల కారణంగా అతడిని హత్యచేసి ఉండవచ్చని సీఐ సురేశ్ అనుమానం వ్యక్తం చేశారు.
Similar News
News February 11, 2026
NZB: ఒంటి గంట వరకు 39.68 శాతం పోలింగ్

నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మధ్యాహ్నం 1 గంట వరకు ఓవరాల్గా 39.68 శాతం పోలింగ్ నమోదైంది. NZB కార్పొరేషన్ లో 35.49 శాతం, ఆర్మూర్ మున్సిపాలిటిలో 47.93 శాతం, బోధన్లో 50.69 శాతం, భీంగల్ మున్సిపాలిటీలో 51.53 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలో 4,95,485 మంది ఓటర్లకు గాను ఇప్పటి వరకు 1,96,606 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు.
News February 11, 2026
నిజామాబాద్: పోలింగ్ కేంద్రాల్లో సీపీ పర్యవేక్షణ

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా బుధవారం సీపీ సాయి చైతన్య పోలింగ్ సరళిని క్షుణ్ణంగా పర్యవేక్షించారు. నగరంలోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్, చంద్రశేఖర్ కాలనీ, కోటగల్లి తదితర ప్రాంతాల్లోని బూత్లను సందర్శించి భద్రతను సమీక్షించారు. సీపీ స్వయంగా ఓ వృద్ధుడిని వీల్ చైర్లో పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లి మానవత్వం చాటుకున్నారు. ప్రజలు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News February 11, 2026
NZB: 11 గంటల వరకు పోలింగ్ శాతం ఎంతంటే?

నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 11 గంటల వరకు ఓవరాల్గా 22.54 శాతం పోలింగ్ నమోదైంది. NZB కార్పొరేషన్ లో 18.94శాతం, BDNలో 32.35%, ARMRలో 29.60%, BMGL మున్సిపాలిటీలో 31.09% పోలింగ్ నమోదైంది. జిల్లాలో 729 పోలింగ్ స్టేషన్లలో 4,95,485 మంది ఓటర్లకు గాను ఇప్పటి వరకు 1,11, 681మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు.


