News June 26, 2024
ఖమ్మంలో నేటి నుంచి జీఎన్ఎం పరీక్షలు
నేటి నుంచి జులై 6 వరకు జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ(జీఎన్ఎం) విద్యార్థుల సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశామని మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరరావు తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు నర్సింగ్ కళాశాల లకు చెందిన 530 మంది విద్యా ర్థులు హాజరవుతారని వివరించారు. ఖమ్మం మెడికల్ కళాశాల భవనంలో పరీక్షల నిర్వహణకు అవసరమైన సదుపాయాలను సమ కూర్చామని ఆయన వెల్లడించారు.
Similar News
News July 1, 2024
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పంటల ధరల వివరాలు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పంటల ధరల వివరాలను మార్కెట్ శాఖ అధికారులు సోమవారం ఉదయం వెల్లడించారు. ఏసీ మిర్చి ధర రూ.20,000 జండా పాట పలుకగా పత్తి రూ.7,300 జెండా పాట పలికినట్లు వెల్లడించారు. పత్తి ధర మొన్నటి కంటే 50 రూపాయలు పెరగగా ఏసీ మిర్చి ధర నిలకడగా కొనసాగుతోంది. పత్తికి రేటు పెరుగుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News July 1, 2024
రోడ్డుప్రమాదం, డీఏఓ పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
సత్తుపల్లిలోని డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ పరీక్ష రాసేందుకు దాదాపు 20 మంది అభ్యర్థులు బస్సులో వెళ్తుండగా ప్రమాదం జరగడంతో కొందరు గాయాలపాలయ్యారు. చికిత్స కోసం వారిని పీహెచ్సీకి తరలించగా పరీక్ష సమయం దాటిపోవడంతో పలువురు అభ్యర్థులు పరీక్షకు దూరం అయ్యారు. మరి కొందరిరి గాయాలైనా పరీక్షా కేంద్రాలకు వెళ్లారు. 3 సంవత్సరాలుగా పరీక్షలకి ప్రిపేర్ అయ్యామని మధ్యలో ఇలా జరిగిందని వారు వాపోతున్నారు.
News July 1, 2024
ఖమ్మం: చింత చిగురు కోస్తుండగా పాము కాటు, మహిళ మృతి
కుమార్తెను చూసేందుకు వచ్చిన తల్లి
పాముకాటుతో మృతిచెందిన ఘటన నేలకొండపల్లి మండలంలో ఆదివారం జరిగింది. చింతకాని మండలం నేరడకు చెందిన కోట ఆదెమ్మ(56) శనివారం నేలకొండపల్లి మండలం సదాశివపురంలో ఉంటున్న తన కూతురు గోవిందమ్మ ఇంటికి వచ్చింది. మధ్యాహ్నం చింతచిగురు కోస్తుండగా ఆదెమ్మ కాలిపై పాము కాటు వేసింది. ఆమెను ఖమ్మం తరలించే క్రమంలో పరిస్థితి విషమించి మృతి చెందింది.