News June 26, 2024

హనుమకొండ: మామను చంపిన అల్లుడికి జీవితఖైదు

image

మామను గొడ్డిలితో నరికి చెరువులో పడేసిన అల్లుడికి జీవితఖైదు విధిస్తూ HNK జడ్జి అపర్ణాదేవి తీర్పుచ్చారు. నడికూడ (M) కంఠాత్మకూరు వాసి ఎల్లయ్య(55)తన కుమార్తె స్వాతిని వెంకటేశ్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. 2020 OCT 6న ఎల్లయ్య, వెంకటేశ్ హసన్‌పర్తి చెరువుకట్టపైకి కల్లు తాగడానికి వెళ్లారు. ఈక్రమంలో వారి మధ్య గొడవ జరగగా వెంకటేశ్ గొడ్డలితో నరికి మృతదేహాన్ని చెరువుతో పడేశాడు.

Similar News

News July 1, 2024

వరంగల్: ఈరోజు పత్తి ధర రూ.7,160

image

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఈరోజు పునఃప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్‌కు పత్తి తరలిరాగా.. ధర మాత్రం గత వారంలాగే రూ.7,160 పలికింది. పత్తి ధర పెరగకపోవడంతో రైతన్నలు నిరాశ చెందుతున్నారు. కాగా, మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంన్నది.

News July 1, 2024

MHBD: ఓ వ్యక్తి వేధింపులు.. భార్య మృతి, భర్త సీరియస్

image

ఓ వ్యక్తి వేధింపులు తట్టుకోలేక భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన MHBD జిల్లా నెల్లికుదురు మం.లో ఆదివారం జరిగింది. SI క్రాంతికిరణ్ ప్రకారం.. పెద్దతండాకు చెందిన నీలమ్మను అదే గ్రామానికి చెందిన వీరన్న అనే వ్యక్తి తరచూ వేధింపులకు గురి చేస్తున్నాడు. నీలమ్మ భర్త భద్రు అవమానానికి గురై పురుగు మందు తాగగా.. నీలమ్మ సైతం ఆత్మహత్యకు పాల్పడింది. నీలమ్మ మృతి చెందగా.. భద్రు చికిత్స పొందుతున్నాడు.

News July 1, 2024

వరంగల్ కాంగ్రెస్‌‌లో కలహాలు?

image

ఉమ్మడి WGL జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల మధ్య కలహాలు పెరిగాయనే విమర్శలొస్తున్నాయి. శనివారం CM రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి కనీస సమాచారం లేదని పలువురు ముఖ్యనాయకులు వాపోయారు. ఇదిలా ఉండగా CM పర్యటనలో NSPT MLA దొంతి మాధవరెడ్డి కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. పరకాల నియోజకవర్గంలో సైతం ఫ్లెక్సీలు, ఇతర అంశాలపై వాగ్వాదాలు జరుగుతుండగా.. వర్ధన్నపేటలో నాయకులు, కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం.