News June 26, 2024
ఇది కదా సక్సెస్ అంటే!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719380010024-normal-WIFI.webp)
రాజస్థాన్లోని దళిత కుటుంబానికి చెందిన మహిళ రాజకీయాల్లోకి రావడమే గ్రేట్. అలాంటిది 26 ఏళ్ల సంజనా జాటవ్ MPగా గెలిచి ఫ్యామిలీతో పార్లమెంట్కు వచ్చారు. తల్లి, అత్తామామల ఆశీర్వాదం తీసుకొని భరత్పూర్ MPగా ప్రమాణం చేశారు. రాజకీయాల్లోకి వచ్చేందుకు అత్తామామలను ఒప్పించానని, MLAగా ఓడిపోయినా కాంగ్రెస్ తనను నమ్మి లోక్సభ టికెట్ ఇచ్చిందని ఆమె తెలిపారు. సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఆమె కుటుంబం ఫొటో వైరలవుతోంది.
Similar News
News July 1, 2024
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1717720015898-normal-WIFI.webp)
TG: విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. 0-10 మంది విద్యార్థులున్న స్కూళ్లకు ఒకరు, 11 నుంచి 40 వరకు విద్యార్థులున్న స్కూళ్లకు ఇద్దరు, 41 నుంచి 60 మంది విద్యార్థులున్న స్కూళ్లకు ముగ్గురు, 61కి పైగా విద్యార్థులున్న స్కూళ్లకు గతంలో మాదిరిగానే టీచర్లను కేటాయించనుంది. స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరిగితే అందుకనుగుణంగా కేటాయింపు చేపట్టనుంది.
News July 1, 2024
BREAKING: హైకోర్టులో కేసీఆర్కు చుక్కెదురు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719299802102-normal-WIFI.webp)
TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. విద్యుత్ కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలని ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నిబంధనల మేరకే కమిషన్ వ్యవహరిస్తోందని, కేసీఆర్ పిటిషన్కు విచారణార్హత లేదన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
News July 1, 2024
ఇన్స్టాగ్రామ్లో చరిత్ర సృష్టించిన కోహ్లీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719807552545-normal-WIFI.webp)
టీ20 వరల్డ్ కప్ను టీమ్ఇండియా గెలుపొందడంపై విరాట్ కోహ్లీ చేసిన ఇన్స్టా పోస్ట్ రికార్డు సృష్టించింది. కప్తో, టీమ్తో ఉన్న ఫొటోలతో ‘ఇంతకంటే మంచి రోజు వస్తుందని కలలో కూడా ఊహించలేదు’ అని పోస్ట్ చేశారు. ఈ పోస్టుకు ఇప్పటివరకు 18 మిలియన్ల లైక్స్తో పాటు 6.6 లక్షల కామెంట్స్ వచ్చాయి. గతంలో కియారా, సిద్ధార్థ్ పేరిట ఉన్న రికార్డును సైతం బ్రేక్ చేసింది. WC ఫైనల్లో కోహ్లీ 76 పరుగులు చేసిన విషయం తెలిసిందే.