News June 26, 2024
మెదక్: మంజీరా నదిలో పడి మహిళా ఆత్మహత్య
కొల్చారం మండలం పోతంశెట్టి పల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. యాదాద్రి జిల్లాకు చెందిన వడ్డెర కుల కులస్తులు గ్రామంలో బండరాయి కొట్టుకుంటూ జీవిస్తున్నారు. అయితే ఈనెల 22న బండరాయి కొట్టుకుని జీవించే ఆండాలు అనే మహిళ ఇంట్లో కొడుకుతో గొడవ పడి ఇంట్లో నుండి వెళ్లిపోయింది. బుధవారం గ్రామ శివారులోని ఏడుపాయల వెళ్లే రహదారిలో మంజీరా నదిలో మృతదేహం లభించింది. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News October 2, 2024
మెదక్: ప్రజలకు హరీష్ రావు బతుకమ్మ శుభాకాంక్షలు
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. బతుకమ్మ పండుగ ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అమావాస్య నుంచి తొమ్మిది రోజులు ఆడపడుచులు కలిసి ఆడే గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు. దేశంలోనే పూల ను పూజించి ప్రకృతిని ప్రేమించే పండుగ అన్నారు. అలాంటి సంస్కృతి తెలంగాణలో ఉందన్నారు.
News October 2, 2024
సంగారెడ్డిలో దారుణం.. అన్నను చంపిన తమ్ముడు
సంగారెడ్డి పట్టణంలోని నాల్ సాబ్ గుడ్డలో మంగళవారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. పట్టణ ఎస్ఐ భాస్కర్ రెడ్డి కథనం ప్రకారం.. మద్యం మత్తులో అన్నషాహిద్(46)ను తమ్ముడు రఫిక్ (40) కల్లు సీసాతో కొట్టి హత్య చేశాడు. తనను, తన భార్యను అన్న సూటిపోటి మాటలతో బాధించేవాడని హంతకుడు రఫిక్ తెలిపారు. పోలీసులు రఫిక్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
News October 2, 2024
MDK: మాంసం విషయంలో తగ్గేదే లేదంటున్నా జనం.!
బుధవారం పెత్రమాస అవడంతో ప్రజలు కౌసుపై మక్కువ చూపుతారు. కానీ ఈ సంవత్సరం పెత్రమాసతో పాటు గాంధీ జయంతి రావడంతో అధికారులు జీవహింస చేయరాదని సూచించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని కొన్ని పట్టణాల్లో ఉ.4 గంటలకు మటన్ షాపులు ఓపెన్ చేసి మటన్ అమ్మారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఉ.3 గంటలకె మేకలు, గొర్రెలను కోశారు. పెద్దలకు నైవేద్యంగా పెట్టే మాంసాన్ని ఆచార సంప్రదాయాన్ని మరువలేమని పలువురు అన్నారు.