News June 26, 2024
మాదకద్రవ్యాలకు బానిసలు కావద్దు: కామారెడ్డి ఎస్పీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719394122828-normal-WIFI.webp)
యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే జీవితం నాశనం అవుతుందని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని సందీపని జూనియర్ కళాశాల వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ జండా ఊపి ప్రారంభించి మాట్లాడుతూ.. విద్యార్థులు మాదకద్రవ్యాలకు బానిసలు కావద్దని సూచించారు. విద్యార్థులు ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
Similar News
News July 3, 2024
ఆ దుర్ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది: MP అరవింద్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719936893796-normal-WIFI.webp)
ఉత్తరప్రదేశ్ హాథ్రస్ తొక్కిసలాట దుర్ఘటన పట్ల నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆ ఘటనలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారి కుటుంబాలకు ఆ భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు రాసుకొచ్చారు.
News July 3, 2024
పోచారం శ్రీనివాస్ రెడ్డి హాట్ కామెంట్స్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719921709427-normal-WIFI.webp)
‘ఎప్పుడైనా లోకల్ లోకలే. బయట నుండి వచ్చిన వాళ్లు అద్దెకు ఉండేవారు మాత్రమే’ అంటూ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాసుల బాలరాజు మంగళవారం పోచారంను తన అనుచరులతో కలువగా పోచారం మాట్లాడుతూ.. బాలరాజుకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి వస్తే వాళ్లకు కడుపు నొప్పి ఎందుకు ? అంటూ కాంగ్రెస్లోని ఒక వర్గాన్ని ఉద్దేశించి అన్నారు.
News July 2, 2024
ముఖ్యమంత్రి ఫోన్ చేసి అభిప్రాయం అడిగారు: బాలరాజు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719922042992-normal-WIFI.webp)
పోచారం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు ఫోన్ చేసి అభిప్రాయం అడిగారని కాంగ్రెస్ నాయకుడు కాసుల బాలరాజు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నదని, పోచారం వస్తే అత్యంత బలంగా మారుతుందని, గతంలో కూడా తాను శీనన్నతో కలిసి పనిచేశాను, ఇప్పుడు కూడా కలిసి పనిచేస్తానని ముఖ్యమంత్రికి చెప్పానన్నారు.