News June 26, 2024
మూడో స్థానంలో పార్వతీపురం.. 8వ స్థానంలో విజయనగరం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719401717561-normal-WIFI.webp)
ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా 53 శాతం ఉత్తీర్ణతతో మూడో స్థానంలో నిలిచింది. 1,679 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 884 మంది పాసయ్యారు. విజయనగరం జిల్లాలో 5,673 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 2,502 మంది ఉత్తీర్ణత సాధించారు. 44 శాతం పాస్ పర్సంటేజ్తో రాష్ట్రంలో 8వ స్థానంలో నిలిచింది.
Similar News
News July 3, 2024
VZM: బాలుడి ముక్కు కొరికేసిన కుక్కలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719977653204-normal-WIFI.webp)
బాడంగి మండలం గొల్లాదిలో వీధి కుక్కలు దాడిలో ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. డి.లోకేశ్ ఇంటి నుంచి మంగళవారం బయటకు వెళ్లగా కుక్కలు దాడి చేసి ముక్కు కొరికేశాయి. చెంప, చేతి భాగంలో కూడా గాయాలయ్యాయి. సాయంత్రం చింతాడ లక్ష్మిపై కూడా దాడి చేశాయి. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అధికారులు స్పందించి కుక్కలు బెడద నుంచి కాపాడాలని గ్రామస్థులు కోరుతున్నారు.
News July 3, 2024
విజయనగరం: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719969183459-normal-WIFI.webp)
AU పరిధిలో డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. ఈ నెల 4,6 తేదీలలో డా.వీఎస్ కృష్ణ కళాశాలలో స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. ఈ నెల 10 వరకు రిజిస్ట్రేషన్ చేసుకొని.. 11 తేదీ నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. 19న సీట్ల కేటాయించి..22 లోపు క్లాసులు ప్రారంభిస్తామని వర్సిటీ అధికారులు తెలిపారు. AU పరిధిలో మొత్తం 163 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి.
News July 3, 2024
జిల్లాలో కాన్సర్ బాధితుల కోసం కలెక్టర్కు వినతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719923053498-normal-WIFI.webp)
జిల్లాలో కాన్సర్ బాధితులకు ఎటువంటి వైద్య సహాయం అందించట్లేదని కాన్సర్ ఆసుపత్రి సాధన కమిటీ అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. మన్యం జిల్లాకు కూడా కలిపి విజయనగరంలో కాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేసే ఏర్పాట్లు చేయాలని కోరారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కీమోథెరపీ లాంటి చికిత్సలు అందించేలా కృషి చేయాలన్నారు.