News June 26, 2024
టికెట్ రీషెడ్యూల్ చేయలేదని బాంబు బెదిరింపు!

తన టికెట్ను రీషెడ్యూల్ చేయలేదన్న కోపంతో ఏకంగా విమానంలో బాంబుందని బెదిరించాడో వ్యక్తి. కేరళకు చెందిన షుహైబ్(30) తన భార్య, కుమార్తెతో కలిసి ఎయిర్ ఇండియా(ఏఐ) విమానంలో లండన్కు వెళ్లాల్సి ఉంది. కుమార్తె ఒక్కసారిగా అనారోగ్యానికి గురి కావడంతో రీషెడ్యూల్ చేయాలని ఏఐను కోరారు. అధికారులు నిరాకరించడంతో విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపునకు పాల్పడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు షుహైబ్ను అరెస్ట్ చేశారు.
Similar News
News January 5, 2026
వాల్నట్స్ వీరు తినకూడదు

వాల్నట్స్లో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు మెదడు, గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే కొన్నిరకాల సమస్యలు ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు. జీర్ణ సమస్యలు, రక్తస్రావ రుగ్మతలు ఉన్నవారు, బరువు తగ్గాలనుకునేవారు, మూత్రపిండాల్లో రాళ్లున్నవారు, శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన వాళ్లు ఇవి తీసుకోకూడదని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
News January 5, 2026
USలో తెలుగు యువతి హత్య.. ఇండియాలో నిందితుడి అరెస్ట్?

USలోని మేరీల్యాండ్లో తెలుగు యువతి నిఖిత గొడిశాల(27) హత్యకు గురైన కేసులో నిందితుడు అర్జున్ శర్మ అరెస్ట్ అయినట్లు ఇండియా టుడే వెల్లడించింది. ఆ కథనాల ప్రకారం.. ఇంటర్పోల్ సాయంతో అతణ్ని తమిళనాడులో అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 31న కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. నిఖిత కనిపించడం లేదని జనవరి 2న పోలీసులకు ఫిర్యాదు చేసిన అర్జున్ అదే రోజు తెలివిగా ఇండియాకు పారిపోయివచ్చాడు.
News January 5, 2026
సీమ ద్రోహి ఎవరో తెలిసే ప్రజలు తీర్పిచ్చారు: అచ్చెన్న

AP: నదీజలాల అంశంపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. రాష్ట్రాల మధ్య సంబంధాలు వేరు.. హక్కులు వేరని వ్యాఖ్యానించారు. హక్కుల విషయంలో ఏమాత్రం తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. 2020లోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిందని ఆరోపించారు. రాయలసీమ ద్రోహి ఎవరో తెలిసే ప్రజలు కూటమికి పట్టం కట్టారన్నారు.


