News June 26, 2024
NZB: జిల్లా వ్యాప్తంగా పాఠశాలల బంద్ విజయవంతం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719396962893-normal-WIFI.webp)
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బుధవారం పాఠశాలల బంద్ విజయవంతమైనట్లు ఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వీనర్ కైరి శశి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో వసూలు చేస్తున్న ఫీజులను నియంత్రించాలని, విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు పాఠశాలల బంద్ పిలుపు ఇవ్వడం జరిగిందన్నారు. బంద్లో దామ సునీల్, జగదీష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారన్నారు.
Similar News
News July 3, 2024
NZB: ‘పదెకరాల్లోపు ఉన్నవారికే రైతుభరోసా ఇవ్వండి’
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719977207545-normal-WIFI.webp)
రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకం చేపట్టనున్న రైతుభరోసా పథకంపై రైతుల సూచనలు కోరుతోంది. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 89 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. ఇప్పటివరకు 60 సంఘాల్లో మీటింగ్స్ నిర్వహించారు. 29 సంఘాల్లో సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. ఇప్పటి వరకు తీసుకున్న అభిప్రాయాల్లో 60 శాతం మంది 10ఎకరాల లోపు ఉన్నవారికే రైతుభరోసా ఇవ్వాలని చెబుతున్నారు. గుట్టలు, బీడు భూములకు ఇవ్వొదని కోరుతన్నారు.
News July 3, 2024
ఆ దుర్ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది: MP అరవింద్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719936893796-normal-WIFI.webp)
ఉత్తరప్రదేశ్ హాథ్రస్ తొక్కిసలాట దుర్ఘటన పట్ల నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆ ఘటనలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారి కుటుంబాలకు ఆ భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు రాసుకొచ్చారు.
News July 3, 2024
పోచారం శ్రీనివాస్ రెడ్డి హాట్ కామెంట్స్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719921709427-normal-WIFI.webp)
‘ఎప్పుడైనా లోకల్ లోకలే. బయట నుండి వచ్చిన వాళ్లు అద్దెకు ఉండేవారు మాత్రమే’ అంటూ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాసుల బాలరాజు మంగళవారం పోచారంను తన అనుచరులతో కలువగా పోచారం మాట్లాడుతూ.. బాలరాజుకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి వస్తే వాళ్లకు కడుపు నొప్పి ఎందుకు ? అంటూ కాంగ్రెస్లోని ఒక వర్గాన్ని ఉద్దేశించి అన్నారు.