News June 26, 2024
ఫోన్ ట్యాపింగ్ కేసు: రేపు తీర్పు ఇవ్వనున్న నాంపల్లి కోర్టు

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టు తీర్పును రేపటికి రిజర్వ్ చేసింది. పిటిషన్ వేసినప్పుడు కోర్టులో ఛార్జిషీటు లేదని నిందితుల తరఫు న్యాయవాది వాదించారు. అరెస్టైన 90 రోజుల్లో ఛార్జిషీట్ వేయకపోతే బెయిల్ ఇవ్వొచ్చని అన్నారు. జూన్ 10నే ఛార్జిషీట్ దాఖలు చేసినా కొన్ని కారణాలతో వెనక్కి పంపినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. ఇరు పక్షాల వాదనలను విన్న కోర్టు రేపు తీర్పు ఇవ్వనుంది.
Similar News
News November 8, 2025
ఎర్రచందనం దుంగలను పరిశీలిస్తున్న పవన్

జిల్లా పర్యటనలో భాగంగా Dy.CM పవన్ కళ్యాణ్ తిరుపతి మంగళంలోని ఎర్రచందనం నిల్వ ఉన్న గోడౌన్కు చేరుకున్నారు. ఇందులో భాగంగా ఆయన అక్కడ ఎర్రచందనం దుంగలను పరిశీలించారు. ఎన్ని టన్నుల దుంగలు ఉన్నాయి వంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
News November 8, 2025
DEC 1 నుంచి పార్లమెంట్ సమావేశాలు

డిసెంబర్ 1 నుంచి 19 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేలా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్మాణాత్మక చర్చల కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.
News November 8, 2025
AFCAT నోటిఫికేషన్ విడుదల

ఎయిర్ఫోర్స్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్(MPC), BE, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు శారీరక ప్రమాణాలు కలిగిన వారు NOV 10 నుంచి DEC 9 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫ్లయింగ్ బ్రాంచ్కు 20-24ఏళ్లు, గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్కు 20-26ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.56,00-రూ.1,77,500 చెల్లిస్తారు. కోర్సు 2027 JANలో ప్రారంభమవుతుంది.


