News June 26, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ పెగడపల్లి మండలంలో బైక్, టాటా ఏస్ డీ.. ఒకరి మృతి మరొకరికి తీవ్ర గాయాలు. @ ముస్తాబాద్ మండలంలో 4 ఇసుక ట్రాక్టర్లు సీజ్. @ రాయికల్ మండలంలో తనిఖీలు నిర్వహించిన జగిత్యాల కలెక్టర్. @ పెండింగ్ పనులను పూర్తి చేయాలన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్. @ జగిత్యాల అడిషనల్ కలెక్టర్ గా రఘువరన్. @ యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలన్న కరీంనగర్ కలెక్టర్. @ ఢిల్లీ వెళ్ళిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

Similar News

News February 24, 2026

KNR: ‘పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి’

image

మార్చి 14 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలను కరీంనగర్ జిల్లాలో ఎక్కడా ఎలాంటి తప్పిదాలు జరగకుండా పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. 74 కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీరు, ఫ్యాన్లు, వైద్య సదుపాయాలు కల్పించాలని, మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా నిబంధనలు పక్కాగా అమలు చేయాలన్నారు.

News February 24, 2026

KNR: ‘మహిళా కార్యకర్తలు కృషి చేయాలి’

image

కరీంనగర్ DCC కార్యాలయంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న రెడ్డి ఆధ్వర్యంలో నేడు సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత పదేళ్లుగా పార్టీ కోసం పోరాడిన సీనియర్ మహిళా నేతలకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు. రాబోయే ZPTC, MPTC ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి మహిళా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

News February 24, 2026

KNR: డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం

image

భద్రతపై అవగాహన కల్పించే ‘అరైవ్ అలైవ్’లో భాగంగా ఈ నెల 27న వాహన చోదకులకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. కరీంనగర్ కమిషనరేట్‌లో ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ప్రమాదాల నివారణలో కంటిచూపు కీలకమని, ఆర్టీసీ, ఆటో, ఇతర వాహన డ్రైవర్లు పోలీసు ప్రధాన కార్యాలయం పక్కన గల అస్త్ర కన్వెన్షన్ హాల్‌లో ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు.