News June 27, 2024

తెలంగాణ పూర్తి స్థాయి గవర్నర్‌గా రాధాకృష్ణన్?

image

TG: రాష్ట్ర పూర్తి స్థాయి గవర్నర్‌గా ఇన్‌ఛార్జ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాధాకృష్ణన్ ఝార్ఖండ్ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. పుదుచ్చేరికి కూడా ఆయన ఇన్‌ఛార్జ్ గవర్నర్‌గా ఉన్నారు. తనను తెలంగాణ పూర్తి స్థాయి గవర్నర్‌గా కొనసాగించాలని ఇటీవలే హోంమంత్రి అమిత్ షాను రాధాకృష్ణన్ కోరినట్లు సమాచారం. ఇందుకు ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Similar News

News September 17, 2025

ECILలో 160 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు

image

TG: HYDలోని ప్రభుత్వరంగ సంస్థ ECIL 160 కాంట్రాక్ట్ బేస్డ్ టెక్నికల్ ఆఫీసర్-C ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. BE/B.Tech విభాగాల్లో 60% మార్కులు, ఏడాది అనుభవం, 30 ఏళ్లలోపు వాళ్లు అర్హులు. జీతం తొలి ఏడాదిలో నెలకు రూ.25 వేలు, రెండో ఏడాది రూ.28 వేలు, 3, నాలుగో ఏడాది రూ.31 వేల చొప్పున ఇస్తారు. ఈనెల 22లోపు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం https://ecil.co.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించండి.

News September 17, 2025

రోజూ గంట నడిస్తే.. ఇన్ని లాభాలా?

image

నడక వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. రోజులో గంటసేపు నడిస్తే శరీరంలో జరిగే మార్పుల గురించి వివరించారు. *రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. *ఒత్తిడి తగ్గుతుంది. *మానసిక స్థితి మెరుగవుతుంది.
*రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలోకి వస్తాయి. *పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. *మనసు ప్రశాంతంగా ఉంటుంది. *డోపమైన్ (హ్యాపీ హార్మోన్) పెరుగుతుంది. అందుకే నడవడం మొదలుపెట్టండి. SHARE IT

News September 17, 2025

తెలంగాణ విమోచన వేడుకల్లో రాజ్ నాథ్ సింగ్

image

TG: హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఇవాళ బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై.. జాతీయ జెండాను ఎగుర వేస్తారు. ఆయన నిన్న సాయంత్రమే ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. గతేడాది కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.