News June 27, 2024
IND vs ENG: ఫైనల్ చేరేదెవరో?
టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఇవాళ భారత్, ఇంగ్లండ్ మధ్య సెమీఫైనల్ జరగనుంది. గయానాలోని డారెన్ సామి స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. T20WC-2022 సెమీఫైనల్ ఓటమికి ఇంగ్లండ్పై ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది. మరోవైపు బట్లర్ సేన అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉండి టీమ్ ఇండియాకు సవాల్ విసిరేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్కు వర్షం ముప్పు ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News October 10, 2024
రోహిత్ శర్మ అభిమానులకు బ్యాడ్ న్యూస్!
ఆస్ట్రేలియాతో నవంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే సిరీస్లో ఓ టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాల వల్ల తొలి 2 మ్యాచుల్లో ఒకటి ఆడకపోవచ్చని రోహిత్ ఇప్పటికే బీసీసీఐకి సమాచారం ఇచ్చినట్లు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పేర్కొంది. సిరీస్ ప్రారంభానికి ముందే తన పనులు పూర్తయితే అన్ని టెస్టులు ఆడే అవకాశం ఉంది. రోహిత్ దూరమైతే అభిమన్యు ఈశ్వరన్ ఆడే అవకాశం ఉందని సమాచారం.
News October 10, 2024
భారీగా ‘సిప్’ చేస్తున్నారు.. సెప్టెంబర్లో రికార్డు
దేశంలో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెరుగుతున్నాయి. మొదటిసారిగా ఒక నెలలో ₹ 24,508.73 కోట్లకు పెట్టుబడులు చేరుకున్నట్టు AMFI వెల్లడించింది. ఆగస్టు నెలలో నమోదైన ₹23,547.34 కోట్లతో పోలిస్తే ఇది 4% అధికం. సెప్టెంబర్లో 66,38,857 కొత్త సిప్లు నమోదయ్యాయి. AUMలు గరిష్ఠ స్థాయి ₹13.81 లక్షల కోట్లకు చేరుకున్నాయి. మొత్తం SIP ఖాతాల సంఖ్య ఆగస్టులో 9.61 కోట్ల నుంచి 9.8 కోట్లకు చేరుకుంది.
News October 10, 2024
బీజేపీ నేతల్ని హెచ్చరించిన మావోయిస్టులు
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఛత్తీస్గఢ్ బీజేపీ నేతల్ని మావోయిస్టులు హెచ్చరించారు. పార్టీ విస్తరణ చర్యలు నిలిపివేయాలని బీజేపీ నేతలు వెంకటేశ్వర్, బిలాల్ ఖాన్లను బీజాపూర్ జిల్లాలోని మావోయిస్టుల మాడెడ్ ఏరియా కమిటీ ఆదేశించింది. తమ ఆదేశాలను ధిక్కరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. దీంతో బీజాపూర్, సుక్మా జిల్లాల్లో బీజేపీ మెంబర్షిప్ డ్రైవ్ నిలిచిపోయింది.