News June 27, 2024

గురుకులాల్లో మిగిలిన సీట్లకు దరఖాస్తు చేసుకోండి: శ్రీదేవి

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో 6, 7, 8, 9వ తరగతిలో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు APSWREIS కో-ఆర్డినేటర్ ఐ.శ్రీదేవి తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను ఆయా పాఠశాలల్లో పొంది ఈ నెల 28వ తేదీ లోగా అదే పాఠశాలల్లో అందజేయాలన్నారు. రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు.

Similar News

News July 3, 2024

నంద్యాల: ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ.. వ్యక్తి మృతి

image

నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరు సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. కర్నూలు నుంచి వస్తున్న ఒంగోలు ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు బ్రాహ్మణకొట్కూరు సమీపంలో బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో రవి(35) చెందాడు. ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News July 3, 2024

నంద్యాల: విధుల్లో ఉండగానే టీచర్ మృతి

image

విధుల్లో ఉన్న ఉపాధ్యాయుడు ఒక్కసారిగా కుప్పకూలి మంగళవారం మృతిచెందారు. ఆత్మకూరులో నివాసముంటున్న జీ.నాగలక్ష్మయ్య(58) కొత్తపల్లి మండలం కొత్తమాడుగుల ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. భోజన విరామ సమయంలో ఉన్నఫళంగా ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న ఉపాధ్యాయుడిని తోటి ఉపాధ్యాయులు ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

News July 3, 2024

కర్నూలు: హిజ్రాలకు గుర్తింపు కార్డులు

image

కర్నూలు జిల్లాలో నివాసం ఉంటున్న హిజ్రాలకు ధ్రువపత్రాలు, గుర్తింపు కార్డులను అందించేందుకు చర్యలు చేపట్టినట్లు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్ ఫాతిమా తెలిపారు. ఇప్పటి వరకు వాటిని పొందని వారు http://transgender.dosje.gov.inలో ఆధార్ కార్డు, నోటరీ అఫిడవిట్ పొందుపరిస్తే కలెక్టర్ ద్వారా ధ్రువపత్రాలు, గుర్తింపు కార్డులను అందిస్తామన్నారు.