News June 27, 2024

విద్యుత్ వినియోగదారుల కోసం కొత్త సదుపాయం

image

TG: కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనే అనుమానాలున్న వినియోగదారుల కోసం దక్షిణ తెలంగాణ పంపిణీ సంస్థ ఓ సదుపాయాన్ని తీసుకొచ్చింది. <>వెబ్‌సైట్‌లో<<>> విద్యుత్ ఛార్జీలను తెలుసుకునేందుకు వీలుగా ‘ఎనర్జీ ఛార్జెస్ కాలిక్యులేటర్ ఫర్ డొమెస్టిక్ సర్వీసెస్’ అనే సర్వీసును ప్రారంభించింది. దీని కోసం రీడింగ్ తేదీలు, యూనిట్ల వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఉత్తర డిస్కం వినియోగదారులూ దీనిని వినియోగించుకోవచ్చు.

Similar News

News October 10, 2024

భారీగా ‘సిప్’ చేస్తున్నారు.. సెప్టెంబర్‌లో రికార్డు

image

దేశంలో మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డులు పెరుగుతున్నాయి. మొద‌టిసారిగా ఒక నెల‌లో ₹ 24,508.73 కోట్లకు పెట్టుబ‌డులు చేరుకున్న‌ట్టు AMFI వెల్ల‌డించింది. ఆగ‌స్టు నెల‌లో న‌మోదైన ₹23,547.34 కోట్లతో పోలిస్తే ఇది 4% అధికం. సెప్టెంబ‌ర్‌లో 66,38,857 కొత్త సిప్‌లు న‌మోద‌య్యాయి. AUMలు గరిష్ఠ స్థాయి ₹13.81 లక్షల కోట్లకు చేరుకున్నాయి. మొత్తం SIP ఖాతాల సంఖ్య ఆగస్టులో 9.61 కోట్ల నుంచి 9.8 కోట్ల‌కు చేరుకుంది.

News October 10, 2024

బీజేపీ నేతల్ని హెచ్చరించిన మావోయిస్టులు

image

పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఛత్తీస్‌గ‌ఢ్ బీజేపీ నేత‌ల్ని మావోయిస్టులు హెచ్చ‌రించారు. పార్టీ విస్త‌ర‌ణ చ‌ర్య‌లు నిలిపివేయాల‌ని బీజేపీ నేతలు వెంకటేశ్వర్, బిలాల్ ఖాన్‌లను బీజాపూర్ జిల్లాలోని మావోయిస్టుల మాడెడ్ ఏరియా కమిటీ ఆదేశించింది. తమ ఆదేశాలను ధిక్కరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. దీంతో బీజాపూర్‌, సుక్మా జిల్లాల్లో బీజేపీ మెంబ‌ర్‌షిప్ డ్రైవ్‌ నిలిచిపోయింది.

News October 10, 2024

నా బిడ్డను దేశమంతా బస్సులో తిరగమన్నాను: ఆమిర్

image

తన కుమారుడు జునైద్‌ను కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ బస్సులో తిరగమని చెప్పానని బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ తెలిపారు. త్వరలో టెలికాస్ట్ కానున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ఎపిసోడ్‌లో ఆయన ఈ విషయం చెప్పారు. ‘భారత్ అనేక సంస్కృతులకు నిలయం. దేశవ్యాప్తంగా ప్రయాణించి అవన్నీ తెలుసుకోవాలని, ప్రజలతో మమేకమవ్వాలని చెప్పాను. ఏ స్కూల్, కాలేజీ చెప్పని అంశాలు ఈ ప్రయాణంలో తెలుస్తాయి’ అని పేర్కొన్నారు.