News June 27, 2024
శ్రీనివాసుడి దర్శనానికి 18 గంటల సమయం
AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 21 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 77,332 మంది దర్శించుకోగా 30,540 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.38 కోట్లు లభించింది.
Similar News
News September 20, 2024
నేడు ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పర్యటన
AP: సీఎం చంద్రబాబు ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. నాగులుప్పలపాడు మండలంలో జరిగే ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. 100 రోజుల పాలనలో తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా కూటమి ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆరు రోజులపాటు ఈ ప్రోగ్రామ్ కొనసాగనుంది.
News September 20, 2024
DSC అభ్యర్థుల ఎదురుచూపులు.. GRL విడుదల ఆలస్యం
TG: డీఎస్సీ ఆన్లైన్ పరీక్షల తుది ‘కీ’ ఈ నెల 6న రిలీజ్ చేయగా, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్(GRL) కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. డీఎస్సీ మార్కులకు టెట్ స్కోరును కలిపి వారంలో లిస్ట్ ఇవ్వాల్సి ఉండగా ఇప్పటికీ సమాచారం లేదు. జాబితా విడుదలకు మరింత ఆలస్యం కానుండడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. GRL ఇచ్చాక జిల్లాల వారీగా ఒక్కో పోస్టుకు ముగ్గురిని ఎంపిక చేసి మెరిట్ జాబితాను DEOలకు పంపాల్సి ఉంటుంది.
News September 20, 2024
నేడు క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్
TG: CM రేవంత్ అధ్యక్షతన ఇవాళ సా.4 గంటలకు క్యాబినెట్ భేటీ జరగనుంది. రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదల శాఖలకు ఉన్న ప్రత్యేక అధికారాలను హైడ్రాకు కల్పించడంపై నిర్ణయం తీసుకోనుంది. కొత్త రేషన్, ఆరోగ్యశ్రీ కార్డుల జారీ, వరద నష్టం, పరిహారం చెల్లింపుపై చర్చించనుంది. తెలుగు వర్సిటీకి సురవరం, కోఠి మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ, హ్యాండ్లూమ్ వర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేర్లను పెట్టడానికి ఆమోదం తెలపనుంది.