News June 27, 2024
అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు
T20WC 2వ సెమీఫైనల్లో ఈ రోజు ఇంగ్లండ్ను భారత్ ఢీకొట్టనుంది. ఈ నేపథ్యంలో గత T20WCలో ఇండియాVSఇంగ్లండ్ మ్యాచ్ పలువుర్ని కలవరపెడుతోంది. అందులో ఇంగ్లండ్ ఓపెనర్లే లక్ష్యాన్ని ఛేదించారు. అయితే టీమ్ఇండియాలో అప్పటికి, ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు బుమ్రా, జడేజా, కుల్దీప్ చేరికతో బౌలింగ్ లైనప్ బలంగా ఉంది. మరోవైపు ఇంగ్లండ్లో స్టోక్స్, వోక్స్, హేల్స్ వంటి అనుభవజ్ఞులు లేరు.
Similar News
News September 20, 2024
మాల్దీవులకు మళ్లీ సాయం
మాల్దీవుల రిక్వెస్ట్ మేరకు మరో $50 మిలియన్ల ఆర్థికసాయం అందించేందుకు భారత్ సిద్ధమైంది. ఆ దేశ ఫైనాన్స్ మినిస్ట్రీ జారీచేసిన టీ-బిల్స్ను SBI సబ్స్క్రైబ్ చేసుకుంది. దీంతో ఆ నిధులను వాడుకొనేందుకు వీలవుతుంది. మేలో చేసిన సాయానికి ఇది అదనం. ‘మాలెకు ఢిల్లీ చిరకాల మిత్రుడు. బడ్జెటరీ సపోర్టు అందించినందుకు మా ప్రజల తరఫున థాంక్స్’ అని ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి అబ్దుల్లా అన్నారు.
News September 20, 2024
వాటర్ హీటర్ వాడుతున్నారా?
వాటర్ హీటర్తో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిన్న NZB జిల్లాకు చెందిన ఓ వ్యక్తి నీళ్లు వేడెక్కాయో లేదో చూసేందుకు హీటర్ ఉండగానే బకెట్లో చేయి పెట్టడంతో షాక్ తగిలి మరణించాడు. స్విచ్ఛాఫ్ చేసి ప్లగ్ తీసేసిన తర్వాతే నీటిని ముట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఇనుము లేదా స్టీల్ కాకుండా ప్లాస్టిక్ బకెట్లు వాడాలని, అవి కరగకుండా ఓ చెక్క ముక్క ఉపయోగించాలంటున్నారు.
>SHARE IT
News September 20, 2024
మాజీ మంత్రి విడదల రజనిపై హోంమంత్రికి ఫిర్యాదు
AP: మాజీ మంత్రి రజని, ఆమె PA తమను బెదిరించి ₹2.20cr వసూలు చేశారని పల్నాడుకు చెందిన బాలాజీ స్టోన్ క్రషర్ సంస్థ సహ యజమాని చలపతిరావు హోంమంత్రి అనితకు ఫిర్యాదు చేశారు. 2020లో తనను పిలిచి మాట్లాడారని, డబ్బులు ఇవ్వకపోతే కంపెనీని సీజ్ చేయిస్తామని బెదిరించారన్నారు. 2021లో ₹2.20cr ఇచ్చినట్లు తెలిపారు. తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. దీనిపై హోంమంత్రి విచారణకు ఆదేశించినట్లు సమాచారం.