News June 27, 2024
రేవంత్ ప్రభుత్వం ఆ సంప్రదాయాన్ని విరమించుకోవడం విచారకరం: KTR
2014-2023 మధ్య తాము ప్రతి ఏడాది జూన్ 2న IT, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల వార్షిక నివేదికలను విడుదల చేశామని KTR గుర్తుచేశారు. ‘ఈ నివేదికలు రాష్ట్రం సాధించిన విజయాలను గర్వంగా ప్రదర్శించాయి. ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి ప్రజలకు తెలియజేయడమే దీని ఉద్దేశం. కానీ రేవంత్ సర్కార్ ఈ సంప్రదాయాన్ని విరమించుకుంది. 2023-24 వార్షిక నివేదికలను విడుదల చేయకపోవడం విచారకరం’ అని ట్వీట్ చేశారు.
Similar News
News September 20, 2024
నేటి నుంచి సివిల్స్ మెయిన్స్
నేటి నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామ్స్-2024 ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 20, 21, 22, 28, 29 తేదీల్లో దేశవ్యాప్తంగా పరీక్షలు నిర్వహిస్తారు. పేపర్ 1 ఉ.9 నుంచి మ.12 వరకు జరుగుతుంది. ఉ.8.30కు గేట్లు మూసేస్తారు. ఆ తర్వాత లోపలికి అనుమతించరు. హాల్ టికెట్, ఐడీ కార్డు కచ్చితంగా తీసుకెళ్లాలి. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలపై నిషేధం ఉంటుంది.
News September 20, 2024
అశ్విన్ సూపర్ సెంచరీ.. పలు రికార్డులు
BANపై సెంచరీ చేసిన అశ్విన్ పలు రికార్డులను సొంతం చేసుకున్నారు. ఒకే వేదికలో 2సెంచరీలు, పలుమార్లు 5+ వికెట్లు తీసుకున్న ఆటగాళ్ల జాబితాలో చేరారు. అశ్విన్ చెన్నైలో 2 సెంచరీలు, 4సార్లు 5 వికెట్లు తీశారు. సోబెర్స్ హెడ్డింగ్లీలో, కపిల్ చెన్నైలో, క్రెయిన్స్ ఆక్లాండ్లో, ఇయాన్ హెడ్డింగ్లీలో ఈ ఫీట్ చేశారు. అలాగే నం.8 లేదా దిగువన బ్యాటింగ్కు దిగి అత్యధిక సెంచరీలు(4) చేసిన రెండో ప్లేయర్గా అశ్విన్ నిలిచారు.
News September 20, 2024
పేజర్లు, వాకీటాకీలపై విమానాల్లో నిషేధం
పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో వణికిపోతున్న లెబనాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ రాజధాని బీరుట్ నుంచి వెళ్లే విమానాల్లో వాటిని తీసుకెళ్లడంపై నిషేధం విధించింది. విమాన ప్రయాణికులందరినీ క్షుణ్ణంగా చెక్ చేయాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని పేర్కొంది. కాగా వాకీటాకీలు, పేజర్లు పేలుడు ఘటనల్లో 30 మందికి పైగా చనిపోగా, వేలాది మంది గాయపడ్డారు.