News June 27, 2024
తాగు నీటి సౌకర్యం లేని గ్రామాలపై దృష్టి పెట్టాలి: పవన్ కళ్యాణ్
AP: అతిసారం కేసులు పెరుగుతున్నందున తాగు నీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. మంచి నీటి సౌకర్యంలేని గ్రామాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని సూచించారు. గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ లాంటి కేంద్ర నిధులను వాడుకోలేకపోయిందన్నారు. ఇకపై వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ పథకం అమలు, నిధుల వివరాలు అందించాలని అధికారులకు సూచించారు.
Similar News
News September 20, 2024
ఆ రెండు రోజుల్లో తిరుమల ఘాట్ రోడ్లలో టూవీలర్స్ నిషేధం
AP: అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఇబ్బంది లేకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు TTD వెల్లడించింది. 8న గరుడ సేవ నేపథ్యంలో 7వ తేదీ రాత్రి 9 నుంచి 9న ఉదయం 6 గంటల వరకు రెండు ఘాట్ రోడ్లలో టూవీలర్స్ రాకపోకలను నిషేధించినట్లు తెలిపింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ ఇప్పటికే అన్ని ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేసిన విషయం తెలిసిందే.
News September 20, 2024
Learning English: Synonyms
✒ Gross: Improper, Rude, Coarse
✒ Happy: Pleased, Contented
✒ Hate: Despise, Loathe, Abhor
✒ Have: Acquire, Gain, Maintain
✒ Help: Aid, Assist, Succor
✒ Hide: Conceal, Shroud, Veil
✒ Hurry: Hasten, Urge, Accelerate
✒ Hurt: Distress, Afflict, Pain
✒ Idea: Thought, Concept, Notion
News September 20, 2024
బీజేపీ ఎంపీ రఘునందన్పై హైకోర్టు ఆగ్రహం
TG: మెదక్ BJP MP రఘునందన్రావుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి న్యాయస్థానం ఇచ్చిన స్టేకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడారని ఓ న్యాయమూర్తి సీజేకు లేఖ రాశారు. ఆయన వ్యాఖ్యలు న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయన్నారు. ఈ లేఖను సుమోటోగా తీసుకున్న ధర్మాసనం రఘునందన్కు నోటీసులు ఇచ్చింది. కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని ఆదేశించింది.