News June 27, 2024
పెన్షన్ల పంపిణీ లేటైతే చర్యలు: మంత్రి స్వామి

పెన్షన్ల పై మంత్రి స్వామి అధికారులకు కీలక సూచనలు చేశారు. వెలగపూడి సచివాలయంలో పెన్షన్ల పంపిణీపై అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. మరో 3 రోజుల్లో పెన్షన్లు పంపిణీ చేయనున్న నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులంతా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జులై 1వ తేదీ లోపే పింఛన్ల పంపిణీ పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధం కావాలన్నారు. ఇందులో జాప్యం జరిగితే చర్యలు తప్పవన్నారు.
Similar News
News January 13, 2026
త్రిపురాంతకం హైవేపై రోడ్డు ప్రమాదం.!

త్రిపురాంతకం మండలంలోని ముడివేముల సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూరగాయల లోడుతో వెళ్తున్న ఆటో- బొలెరో వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కూరగాయల ఆటోలో ఉన్న పలువురికి గాయాలు కాగా.. క్షతగాత్రులను హైవే అంబులెన్స్ సహాయంతో వినుకొండకు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News January 13, 2026
మరోసారి తెరపైకి ప్రకాశం జిల్లా ఎయిర్పోర్ట్

కొత్తపట్నం మండలం ఆలూరు గ్రామ పరిధిలో విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదించిన భూములను కలెక్టర్ రాజబాబు సోమవారం సాయంత్రం పరిశీలించారు. ఎయిర్ పోర్టు అథారిటీ నుంచి వచ్చిన టెక్నికల్ టీం సభ్యులు ఆయుషి రాయ్తో కలిసి కలెక్టర్ భూముల వివరాలను సంబంధిత మ్యాపుల ద్వారా పరిశీలించారు. అనంతరం పలు అంశాలపై ఎయిర్ పోర్టు అథారిటీ అధికారులతో కలెక్టర్ మాట్లాడారు.
News January 13, 2026
విమానాశ్రయం భూములను పరిశీలించిన ప్రకాశం కలెక్టర్

కొత్తపట్నం మండలం ఆలూరు గ్రామ పరిధిలో విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదించిన భూములను కలెక్టర్ రాజబాబు సోమవారం సాయంత్రం పరిశీలించారు. ఎయిర్ పోర్టు అథారిటీ నుంచి వచ్చిన టెక్నికల్ టీం సభ్యులు ఆయుషి రాయ్తో కలిసి కలెక్టర్ భూముల వివరాలను సంబంధిత మ్యాపుల ద్వారా పరిశీలించారు. అనంతరం పలు అంశాలపై ఎయిర్ పోర్టు అథారిటీ అధికారులతో కలెక్టర్ మాట్లాడారు.


