News June 27, 2024
కౌలు రైతులకూ రైతు భరోసా!

TG: కౌలు రైతులకూ రైతు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ వానాకాలం నుంచే అమలు చేయాలని భావిస్తోంది. రాష్ట్రంలో వారు 25 లక్షల మంది ఉన్నట్లు అంచనా. వారిని గుర్తించేందుకు కౌలు రైతుల చట్టం తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ చట్టం ప్రకారం కౌలు రైతు కోసం అసలు రైతు పెట్టుబడి సాయాన్ని కోల్పోనున్నారు. దీంతో వీరిని ఎలా గుర్తించాలన్న దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
Similar News
News January 12, 2026
‘రాజాసాబ్’ మూడు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

‘రాజాసాబ్’ సినిమాకు 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.161కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు Sacnilk వెబ్సైట్ పేర్కొంది. ఇండియాలో రూ.129.20కోట్లు, ఓవర్సీస్లో రూ.31.80 కోట్లు రాబట్టినట్లు తెలిపింది. మూడో రోజు ఇండియాలో రూ.22.6 కోట్లు కలెక్ట్ చేసినట్లు వెల్లడించింది. కాగా నార్త్ అమెరికా గ్రాస్ కలెక్షన్స్ $2.2M (రూ.19.83కోట్లు) దాటినట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది.
News January 12, 2026
బంగ్లాదేశ్ WC మ్యాచులు భారత్లోనే!

టీ20 వరల్డ్ కప్లో తమ మ్యాచులను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ICC ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వాటిని శ్రీలంకకు మార్చకపోవచ్చు. షెడ్యూల్ ప్రకారం బంగ్లా టీమ్ కోల్కతా, ముంబైలో 4 మ్యాచులు ఆడాల్సి ఉంది. వాటిని విదేశాల్లో నిర్వహించకపోవచ్చని సమాచారం. అక్కడ జరగాల్సిన మ్యాచులను చెన్నై, తిరువునంతపురంలో నిర్వహిస్తారని తెలుస్తోంది.
News January 12, 2026
నల్లమల సాగర్తో ఎవరికీ నష్టం లేదు: చంద్రబాబు

AP: నల్లమలసాగర్ ద్వారా రాయలసీమ, ప్రకాశం తదితర ప్రాంతాలకు నీరిచ్చే అవకాశం ఉందని మంత్రులు, అధికారుల మీటింగ్లో CM CBN తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఎవరికీ నష్టం లేదన్నారు. ఎగువ నుంచి వదిలిన నీళ్లు పోలవరం ద్వారా నల్లమల సాగర్కు తీసుకెళ్లి వాడుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. దీనివల్ల సాగర్, శ్రీశైలంలో మిగులుజలాలను AP, TG వాడుకోవచ్చని వ్యాఖ్యానించారు. అందరం కలిసి పనిచేసుకుందామని TGకి కూడా చెప్పానన్నారు.


