News June 27, 2024
ఖమ్మం: కత్తులతో బెదిరించి మెడలో బంగారం చోరీ
కత్తులతో బెదిరించి మెడలో గొలుసును లాక్కొని వెళ్లిన ఘటన తిరుమలాయపాలెంలో మధ్యాహ్నం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. తిరుమలాయపాలెం గ్రామానికి చెందిన బాబురావు తన పామ్ ఆయిల్ తోటకు వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఇద్దరు ఆగంతకులు కత్తులతో బెదిరించి అతని మెడలో ఉన్న 2 తులాల చైను, 6 గ్రాముల బంగారు ఉంగరం ఎత్తుకుపోయారు. బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
Similar News
News July 3, 2024
కొత్త చట్టాలతో బాధితులకు న్యాయం: సీపీ
దేశవ్యాప్తంగా జులై 1నుంచి అమల్లోకి వచ్చిన కొత్త చట్టాల ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని జిల్లా సీపీ సునీల్ దత్ వెల్లడించారు. బాధితుడు ఎస్ఎంఎస్, వాట్సాప్, ఈ – మెయిల్ ఇతర సామాజిక మాధ్యమాలు వేటి ద్వారానైనా ఫిర్యాదు చేయవచ్చన్నారు. బాధితులు కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజలు అపోహలకు తావివ్వకుండా కొత్త చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు.
News July 3, 2024
రైతు ఆత్మహత్య ఘటన.. పదిమందిపై కేసు నమోదు
తన పొలాన్ని ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ సోమవారం చింతకాని మండలం ప్రొద్దుటూరుకు చెందిన <<13548972>>రైతు బోజడ్ల ప్రభాకర్ సూసైడ్<<>> చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై మృతుడి తండ్రి వీరభద్రయ్య ఫిర్యాదు మేరకు ఖానాపురం హవేలి పోలీసు స్టేషన్లో పదిమందిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఇన్స్పెక్టర్ భానుప్రకాశ్ వివరించారు.
News July 3, 2024
పదేళ్లలో BRS ప్రభుత్వం యువతకు ఏం చేసింది:పొంగులేటి
కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో మార్పు రావాలని ప్రజలు ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుని 6 నెలలు అయిందన్నారు. రైతులకు రుణమాఫీ కోసం శ్రీకారం చుట్టామని, ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న రైతులకు ఇచ్చిన మాటను ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పారు. యువతను ప్రతిపక్షం రెచ్చగొడుతుందని, పదేళ్ల BRS ప్రభుత్వం యువతకు ఏం చేసిందని ప్రశ్నించారు.