News June 27, 2024

ఇంగ్లండ్‌లో కౌంటీలు, వన్డే కప్‌ ఆడనున్న రహానే

image

టీమ్ ఇండియా బ్యాటర్ అజింక్య రహానే ఇంగ్లండ్ దేశవాళీ టోర్నీలో ఆడనున్నారు. అక్కడి వన్డే కప్, కౌంటీ ఛాంపియన్‌షిప్ మ్యాచులు ఆడేందుకు లీసెస్టర్‌షైర్‌తో ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు లీసెస్టర్‌షైర్ ఓ ప్రకటనలో వెల్లడించింది. అతడి అనుభవం, నాయకత్వ సామర్థ్యం తమ జట్టుకు లాభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. కౌంటీల్లో ఆడి రహానే ఫామ్‌లోకి రావాలంటూ టీం ఇండియా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Similar News

News October 11, 2024

స్విగ్గీ బాయ్‌కాట్ నిర్ణయం వెనక్కి

image

AP: ఈ నెల 14 నుంచి స్విగ్గీ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ <<14272365>>బాయ్‌కాట్<<>> చేయాలన్న నిర్ణయాన్ని హోటళ్లు, రెస్టారెంట్ల అసోసియేషన్ వెనక్కి తీసుకుంది. స్విగ్గీ యాజమాన్యంతో చర్చలు సానుకూలంగా జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నవంబర్ 1 నుంచి స్విగ్గీతో ఒప్పందాలు అమల్లోకి వస్తాయని పేర్కొంది.

News October 11, 2024

ఎన్‌కౌంటర్ మృతులు 34: బస్తర్ ఐజీ

image

ఈ నెల 5న ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన వారి సంఖ్య 34 అని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. తాము 31 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మిగిలిన 3 మృతదేహాలను మావోయిస్టులు అడవిలోనే ఖననం చేసినట్లు పేర్కొన్నారు.

News October 11, 2024

మోదీ బహుమతిగా ఇచ్చిన కిరీటం చోరీ

image

బంగ్లాదేశ్‌లోని జెశోరేశ్వరి ఆలయంలోని కాళీ మాత కిరీటం చోరీకి గురైంది. ఈ కిరీటాన్ని 2021లో బంగ్లాకు వెళ్లిన సమయంలో ప్రధాని మోదీ దీనిని బహుమతిగా ఇచ్చారు. నిన్న మధ్యాహ్నం ఈ దొంగతనం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆలయ సీసీటీవీ విజువల్స్ ద్వారా దొంగను గుర్తించే పనిలో ఉన్నట్లు చెప్పారు. కాగా ఈ కిరీటం వెండి, బంగారు లోహాలతో తయారు చేశారు.