News June 27, 2024
పార్వతీపురం: ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
పార్వతీపురం మన్యం జిల్లాలోని గరుగుబిల్లి మండలం రావివలస సచివాలయంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న అల్లు తిరుపతినాయుడు ఏసీబీకి చిక్కాడు. గ్రామానికి చెందిన తిరుపతి అనే వ్యక్తికి కాంట్రాక్టు బిల్లుల నిమిత్తం రూ.20వేలు లంచం డిమాండ్ చేయగా.. సదరు బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కార్యదర్శిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
Similar News
News July 5, 2024
VZM: పోస్టింగులకు కార్యదర్శుల ఎదురు చూపులు..!
సరిగ్గా మూడు నెలల క్రితం జిల్లాలో తొమ్మిది మంది గ్రేడ్-2 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్-1 ఉద్యోగులుగా పదోన్నతి లభించింది. ఇప్పటికీ కూడా వారికి పోస్టింగులు ఇవ్వకపోవడంతో ఎదురు చూస్తున్నారు. మార్చి 16 నుంచి జూన్ 6 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నిబంధనలు అడ్డొచ్చాయి. కోడ్ ముగిసి నెల దాటుతున్నా పోస్టింగులు ఇవ్వకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు.
News July 5, 2024
‘APEPDCL యాప్లో బిల్లులు చెల్లించాలి’
రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా మార్గదర్శకాలను అనుసరించి విద్యుత్తు బిల్లులను ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, ఇతర యూపీఐ యాప్ల ద్వారా చెల్లించవద్దని ఏపీఈపీడీసీఎల్ సహాయ గణాంక అధికారిణి ఎం.కుసుమకుమారి ఒక ప్రకటనలో సూచించారు. వినియోగదారుల APEPDCL యాప్ను డౌన్లోడ్ చేసుకుని లేదా సంబంధిత డిస్కం వెబ్ సైట్లో బిల్లులు చెల్లించాలని సూచించారు.
News July 5, 2024
VZM: ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు..!
సాధారణంగా జూన్, జులై నెలల్లో కూరగాయల ధరలు అదుపులోనే ఉంటాయి. ఈ సారి మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి. ధరలు అమాంతంగా పెరగడంతో వినియోగదారులు కొనేందుకు బెంబేలెత్తిపోతున్నారు. పచ్చి మిర్చి, అల్లం, టమాటా ధరలు భారీగా పెరిగాయి. కిలో అల్లం రూ. 150 పైచిలుకు పలుకుతోంది. దళారుల ప్రవేశంతో సిండికేట్గా మారి ధరలు పెంచేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు.