News June 27, 2024
కంచిలి: ఎస్బీఐ ఫలితాల్లో యువకుడి ప్రతిభ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719493365955-normal-WIFI.webp)
కంచిలి మండలం చిన్న శ్రీరాంపురం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన లోళ్ళ కాళీ ప్రశాంత్ గురువారం విడుదలైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగ ఫలితాలలో ప్రతిభ కనబరిచాడు. ప్రాథమిక, ఉన్నత విద్య గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేసి ఉన్నత చదువులతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ SBIలో ఉద్యోగం సాధించాడు. యువకుడి విజయం పట్ల తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.
Similar News
News July 3, 2024
శ్రీకాకుళం: శుభకార్యానికి వెళ్తుండగా హత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719972962555-normal-WIFI.webp)
పొందూరు మండలం చిన్న బొడ్డేపల్లికి చెందిన రాజేశ్వరి(30) హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే
మంగళవారం సంతకవిటి మండలం వాల్తేరులో శుభకార్యానికి ఇద్దరు ఆటోలో బయలుదేరారు. ఆటోలో వాల్తేరు వెళ్తుండగా తాడివలస సమీపంలో ఇద్దరి మధ్య వివాదం జరిగింది. గోపాల్ తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె మెడపై పలుమార్లు దాడి చేయగా.. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News July 3, 2024
హత్రస్ బాధితులకు మంత్రి రామ్మోహన్ సానుభూతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719940075465-normal-WIFI.webp)
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హత్రస్ తొక్కిసలాట బాధితులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేశారు. మంగళవారం యూపీలోని హత్రస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటలో 116 మంది చనిపోవడం, పలువురు గాయపడటం బాధాకరమని రామ్మోహన్ Xలో పోస్ట్ చేశారు.
News July 3, 2024
శ్రీకాకుళంలో 3రోజులు వర్షాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719923151940-normal-WIFI.webp)
ఉత్తరాంధ్ర ప్రాంతాలలో ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో రానున్న 3 రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈనెల 3, 4, 5 తేదీల్లో జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. రేపు మబ్బులతో కూడి అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది.