News June 27, 2024

HYD: సైబరాబాద్‌లో 18 మంది CIల బదిలీ

image

సైబరాబాద్‌ కమిషనరేట్ పరిధిలో 18 మంది CIలు బదిలీ అయ్యారు. కూకట్‌పల్లి, మాదాపూర్, చేవెళ్ల, మైలార్‌దేవ్‌పల్లి, జీడిమెట్ల, రాజేంద్రనగర్, షాద్‌నగర్‌, WPS ఐటీ కారిడార్‌ SHOలు, శంకర్‌పల్లి & మోకిల, జీడిమెట్ల, మాదాపూర్, మైలార్‌దేవ్‌పల్లి డీఐలు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. ముగ్గురు స్పెషల్ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్లు, మేడ్చల్ CCSలో ఒకరు, CYB CI సెల్‌లో‌ మరొకరిని బదిలీ చేస్తూ CP అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News November 2, 2025

BIG BREAKING: వికారాబాద్ జిల్లాలో ముగ్గురి MURDER, ఒకరిపై హత్యాయత్నం

image

ఓ వ్యక్తి ముగ్గురిని హత్య చేసి తాను సూసైడ్ చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఆదివారం తెల్లవారుజామున కుల్కచర్లకు చెందిన వేపూరి యాదయ్య అతడి భార్య, కుమార్తె, వదినను కత్తితో పొడిచి చంపి, మరో కుమార్తెను చంపేందుకు యత్నించాడు. అనంతరం తాను సూసైడ్ చేసుకున్నాడు. పరిగి DSP శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 2, 2025

HYDలో KCR చేసింది ఏం ఉంది: CM రేవంత్ రెడ్డి

image

HYDలో KCR అభివృద్ధి చేసిందేమీ లేదని CM రేవంత్ రెడ్డి అన్నారు. ఎర్రగడ్డలో నవీన్‌ యాదవ్‌కు మద్దతుగా CM రోడ్‌ షో‌ నిర్వహించారు. ‘సిటీకి YSR మెట్రో తెచ్చారు. ORR, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కాంగ్రెస్ నిర్మించింది. IT, ఫార్మా కంపెనీలు మేమే తీసుకొచ్చాము. చంద్రబాబు నాయుడు, YS రాజశేఖర్ రెడ్డి వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చాయి. మరి HYDలో KCR చేసింది ఏం ఉంది’ అంటూ రేవంత్ నిలదీశారు. దీనిపై మీ కామెంట్?

News November 1, 2025

హుస్సేన్‌సాగర్‌లో యువతి మృతదేహం కలకలం

image

హుస్సేన్‌సాగర్‌లో యువతి మృతదేహం(22) కలకలం రేపింది. లేక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని యువతి మృతదేహం నీటిలో తేలియాడుతుందని ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్‌కు చేరుకున్న లేక్ సిబ్బంది డెడ్‌బాడీని బయటకు తీసి, గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాపు చేపట్టారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.