News June 28, 2024
కెప్టెన్, వైస్ కెప్టెన్ అంతా తామై..!
టీ20 వరల్డ్ కప్ ఫైనల్కు టీమ్ ఇండియా చేరుకోవడంలో కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య కీలక పాత్ర పోషించారు. టోర్నీ ఆసాంతం ఇద్దరూ జట్టును ముందుండి నడిపించారు. రోహిత్ ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడి 248 పరుగులు చేసి భారత్ తరఫున అత్యధిక పరుగుల వీరుడిగా కొనసాగుతున్నారు. అలాగే పాండ్య అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో రాణించారు. 139 రన్స్తో పాటు 8 వికెట్లు తీసి జట్టు విజయాలకు కృషి చేశారు.
Similar News
News September 20, 2024
లడ్డూ వ్యవహారం ఎవరూ ఊహించనిది: ప్రణిత
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వులు వినియోగించారనే వార్తలపై నటి ప్రణితా సుభాష్ స్పందించారు. లడ్డూ తయారీలో జంతు కొవ్వులు వినియోగించడం వేంకటేశ్వరస్వామి భక్తులు ఊహించలేని విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని తెలిపారు. మరోవైపు లడ్డూ వ్యవహారంలో దేశవ్యాప్తంగా చర్చనడుస్తోంది. అటు ఇదే వ్యవహారంలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
News September 20, 2024
‘ఎన్టీఆర్-నీల్’ మూవీ షూటింగ్ ఎప్పటి నుంచంటే?
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో Jr.NTR హీరోగా నటించబోయే సినిమా షూటింగ్ అక్టోబర్ 21 నుంచి ప్రారంభం కానుంది. ‘దేవర’ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ షెడ్యూల్లో 40 రోజులపాటు ఇతర నటీనటులతో సీన్లను షూట్ చేస్తారని, తాను 2025 జనవరి నుంచి సెట్స్లో జాయిన్ అవుతానని పేర్కొన్నారు. 2026 జనవరి 9న రిలీజ్ కానున్న ఈ మూవీకి ‘డ్రాగన్’ అనే టైటిల్ను ఖరారు చేసినట్లు సమాచారం.
News September 20, 2024
నేడు సుప్రీంలో ఓటుకు నోటు కేసు విచారణ
ఓటుకు నోటు కేసును నేడు సుప్రీం కోర్టు విచారించనుంది. ఈ కేసును మధ్యప్రదేశ్కు బదిలీ చేయాలని BRS MLA జగదీశ్రెడ్డితో పాటు మరికొందరు నేతలు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్పై ఈరోజు జస్టిస్ బీఆర్.గవాయ్, జస్టిస్ కేవీ.విశ్వనాథన్ల ధర్మాసనం విచారించనుంది. ఇప్పటికే పలుమార్లు ఈ కేసు విచారణకు రాగా సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వాయిదా వేస్తూ వచ్చింది.