News June 28, 2024

KOHLI: తుది పోరులోనైనా మెరుస్తారా?

image

టీ20 WCలో టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఘోర వైఫల్యం చెందుతున్నారు. టోర్నీలో ఇప్పటివరకు ఆయన 75 పరుగులు మాత్రమే చేశారు. కానీ కోహ్లీ ఫామ్‌పై తమకు ఎలాంటి ఆందోళన లేదని కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ ప్రకటించారు. ఫైనల్‌లో ఆయన నుంచి పెద్ద ఇన్నింగ్స్ ఆశిస్తున్నట్లు తెలిపారు. పొట్టి కప్పు సమరంలో విరాట్ 1, 4, 0, 24, 37, 0, 9 రన్స్ మాత్రమే చేశారు. దీంతో ఆయన ఫామ్‌పై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

Similar News

News September 20, 2024

Stock Market: గ్లోబల్ మార్కెట్ల నుంచి పాజిటివ్ సిగ్నల్స్

image

గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో మొదలయ్యాయి. NSE నిఫ్టీ 53 పాయింట్లు పెరిగి 25,468, BSE సెన్సెక్స్ 90 పాయింట్ల లాభంతో 83,275 వద్ద కొనసాగుతున్నాయి. ఐటీ, కన్జూమర్ డ్యురబుల్స్ మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. నిన్న విలవిల్లాడిన మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు నేడు రేంజ్‌బౌండ్లో ట్రేడవుతున్నాయి. JSW స్టీల్, HDFC లైఫ్, కోల్ ఇండియా టాప్ గెయినర్స్.

News September 20, 2024

పెళ్లి పేరుతో 50 మందికి పైగా మహిళల్ని మోసం చేశాడు!

image

పెళ్లి పేరుతో ఓ జడ్జి సహా 50మందికి పైగా మహిళల్ని మోసం చేసిన UP వ్యక్తి ముకీమ్‌ఖాన్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌ క్రియేట్ చేసి ఫేక్ IDలతో తాను ప్రభుత్వ ఉద్యోగినని, భార్య చనిపోయిందని చెప్పేవాడు. పెళ్లి ఫిక్సయ్యాక మ్యారేజ్ హాల్స్ బుకింగ్, ఇతర కారణాలు చెప్పి డబ్బు తీసుకుని పరారయ్యేవాడు. పెళ్లి కాని, వితంతు ముస్లిం మహిళల్నే తాను టార్గెట్ చేసినట్లు విచారణలో తెలిపాడు.

News September 20, 2024

రెండో రోజు ఆట మొదలు

image

చెన్నై వేదికగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట మొదలైంది. నిన్న 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసిన టీమ్ ఇండియా భారీ స్కోర్ చేసేలా కనిపిస్తోంది. క్రీజులో సెంచరీ హీరో రవిచంద్రన్ అశ్విన్(102), జడేజా(86) ఉన్నారు. భారత్ ఎంత స్కోర్ చేస్తుందని మీరు భావిస్తున్నారు? కామెంట్ చేయండి.