News June 28, 2024
తిరుమలలో విజిలెన్స్ అధికారుల విచారణ
AP: తిరుమలలో YCP హయాంలో జరిగిన పనులపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఆర్జిత సేవ, వీఐపీ బ్రేక్ టికెట్ల కేటాయింపు, శ్రీవాణి సేవా టికెట్ల ద్వారా వచ్చిన నిధుల వినియోగం, టెండర్లు, గదుల ఆధునికీకరణ, అగర్బత్తీల తయారీ వంటి అంశాలపై అధికారులు ఫోకస్ చేస్తున్నారు. శ్రీవాణి ట్రస్టు నిధులు పక్కదారి పట్టాయనే ఆరోపణలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. అన్నదానం, లడ్డూ తయారీ విధానాన్నీ పరిశీలించనున్నారు.
Similar News
News September 20, 2024
నన్ను కావాలనే ఇరికించారు: జానీ మాస్టర్
లేడీ కొరియోగ్రాఫర్పై లైంగిక దాడి కేసులో జానీ మాస్టర్ను పోలీసులు ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపర్చారు. కాగా తాను ఎవరిపైనా ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని ఆయన అన్నారు. కొందరు కావాలనే తనపై ఆమెతో ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. లీగల్గా పోరాడి బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు.
News September 20, 2024
లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదు: ఏఆర్ డెయిరీ
తిరుమల లడ్డూ వ్యవహారంపై టీటీడీకి నెయ్యి సరఫరా చేసే తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ స్పందించింది. నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని వెల్లడించింది. ఇదే విషయాన్ని టీటీడీకి వివరించినట్లు చెప్పింది. జులైలో 16 టన్నుల నెయ్యి సరఫరా చేశామని వెల్లడించింది.
News September 20, 2024
ఉప్పరపల్లి కోర్టుకు జానీ
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను పోలీసులు ఉప్పరపల్లి కోర్టుకు తరలించారు. రాజేంద్రనగర్ సీసీఎస్ నుంచి న్యాయస్థానానికి తీసుకెళ్లారు. ఈ ఉదయం నుంచి జానీని పోలీసులు విచారించారు.