News June 28, 2024
గట్టు: గాలిలో దీపంలా సబ్ స్టేషన్ ఆపరేటర్స్ జీవితాలు

విద్యుత్ సబ్ స్టేషన్లలో పనిచేస్తున్న కార్మికుల జీవితాలు గాలిలో దీపంలా మారాయి. సకాలంలో సేఫ్టీ మెటీరియల్ అందించకపోవడం, ఏబి స్విచ్లు మరమ్మత్తులు చేయకపోవడం తదితర కారణాలతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గట్టు మండలంలోని ఆలూరు గ్రామంలోని సబ్ స్టేషన్లో పనిచేస్తున్న ఆపరేటర్ లక్ష్మణ్ నిన్న విద్యుత్ ప్రమాదంలో మృతి చెందాడు. ఏబీ స్విచ్లు డైరెక్ట్గా ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు తెలిపారు.
Similar News
News December 31, 2025
MBNR: ఉద్యోగ నియామకాలు.. ప్రత్యేక సమావేశం

మహబూబ్నగర్లోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఇవాళ జర్మనీ భాష, ఉద్యోగ నియామకాలపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిణి మైత్రి ప్రియ ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. వయస్సు 22-38 సంవత్సరాలు ఉండాలని, BSc నర్సింగ్, GNM అర్హత కలిగిన వారు అర్హులని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News December 30, 2025
BIG BREAKING: మహబూబ్నగర్: ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు!

TGలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా మొదలైంది. భూత్పూర్, దేవరకద్ర, MBNR మున్సిపల్ కమిషనర్లతో EC గిరిధర్ సుందర్ బాబు VC నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికలు FEBలో జరగనున్నాయి. ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా చూడాలని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల లెక్క తేల్చాలని స్పష్టమైన ఆదేశాలు అందాయి. ఈ రిజర్వేషన్ల గెజిట్ వెలువడగానే అధికారిక నోటిఫికేషన్ రానుంది.
SHARE IT
News December 30, 2025
మహబూబ్నగర్: ఆలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రత: ఎస్పీ

ముక్కోటి ఏకాదశి సందర్భంగా జిల్లాలోని ప్రధాన ఆలయాల వద్ద ఎస్పీ డి.జానకి మంగళవారం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బందోబస్తు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని ఎస్పీ వివరించారు.


