News June 28, 2024

ఫలించిన ఆపరేషన్.. చిక్కిన చిరుత

image

నంద్యాల జిల్లాలో చిరుత చిక్కింది. శిరివెళ్ల మండలం పచ్చర్ల టోల్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన బోనులోకి చిరుతపులి వెళ్లింది. దీంతో కొద్ది రోజులుగా భయాందోళనకు గురైన పచ్చర్ల వాసులు ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు చిరుత పులిని సుదూర అటవీ ప్రాంతానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చిరుత దాడిలో పచ్చర్లకు చెందిన మాజీ ఉప సర్పంచి షేక్ మెహరూన్‌బీ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే.

Similar News

News July 8, 2024

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలి: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు తగిన ప్రాధాన్యతనిస్తూ ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. నంద్యాల జిల్లా కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను జిల్లా కలెక్టర్‌కు అర్జీల రూపంలో అందించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు.

News July 8, 2024

పాప ఆచూకీ తెలిసినవారు మాకు తెలియజేయండి : ఎస్ఐ జయశేఖర్

image

ఎనిమిదేళ్ల చిన్నారి అదృశ్యమైన ఘటన ఆదివారం జరిగింది. ఎస్సై జయశేఖర్ వివరాలు..పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామానికి చెందిన 8ఏళ్ల చిన్నారి వాసంతి ఆదివారం మధ్యాహ్నం ఆడుకోవడానికి బయటికి వెళ్లింది. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ముచ్చుమర్రి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన కేసు నమోదు చేసుకొని పాప కోసం గాలిస్తున్నారు. పాప ఆచూకీ తెలిసినవారు పోలీసుస్టేషన్‌ను సంప్రదించాలని కోరారు.

News July 8, 2024

కర్నూలు: వెబ్సైట్‌లో ఇసుక నిల్వల వివరాలు

image

ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లాలో ఇవాళ నుంచి ఉచిత ఇసుక విధానం అమలవుతోంది. వినియోగదారులు ఇసుక సమాచారం వివరాలు https://www.mines.ap.gov.in/permit/ అనే వెబ్సైట్‌లో చూసుకోవాలని జిల్లా గనులు, భూగర్భ శాఖ ఉప సంచాలకులు రాజశేఖర్ తెలిపారు. ఇసుక స్టాక్ పాయింట్ ఎక్కడ ఉంది, ఎంత నిల్వ ఉంది, తదితర వివరాలు వెబ్‌సైట్‌లో ఉంటాయని పేర్కొన్నారు.